బీజేపీలో చేరి జగన్ ని నిలదీస్తా ...సీఎం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి

First Published Sep 30, 2020, 11:12 AM IST

బిగ్ బాస్ నుండి ఎలిమినేటై ఇంటికి చేరిన కరాటే కళ్యాణి వరుస ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని విరుచుకుపడ్డారు 
 

కరాటే కళ్యాణి ఏపీ సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల సంధర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ డిక్లరేషన్ తీసుకోకపోవడమై మండిపడ్డారు.
undefined
జగన్ సీఎం అయితే మాత్రం అనాధిగా వస్తున్న నియమాలు పాటించరా అని ప్రశ్నించారు. ఈ సంధర్భంగా కరాటే కళ్యాణి జగన్ ని ఓ క్రిస్టియన్ గా అభివర్ణించారు.
undefined
జగన్ప్రమాణ స్వీకార సమయంలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ పై ప్రమాణం చేశారని, ఆయన మనసులో ఉంది మాత్రం బైబిల్ అని అన్నారు.
undefined
గోవిందా అని వేంకటేశ్వరుడిని కోట్ల మంది కొలుస్తారు. ఆ కోట్ల మందిలో మీకు ఓట్లు వేసినవాళ్లు కూడా ఉన్నారు. వారి మనోభావాలు మీరు దెబ్బ తీశారు అన్నారు.
undefined
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదు అన్నారు. మీ దేవుళ్ళ జోలికి మేము రావడం లేదు. మా దేవుళ్ళ జోలికి మీరు రాకండి అన్నారు.
undefined
ఇక త్వరలో బీజీపీలో చేరుతాననికరాటే కళ్యాణి స్పష్టం చేశారు. బీజేపీలో చేరిన అనంతరం సీఎంజగన్ ని మరింతగాప్రశ్నిస్తానని, ఈ విషయంపై నిలదీస్తాననికరాటే కళ్యాణి అన్నారు.
undefined
click me!