అయితే దర్శకుడు వివరాలే కాదు, మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లు కాదు, మూడు పార్ట్ లుగా రాబోతుందట. మొదటి పార్ట్ లో బాలకృష్ణ, శివరాజ్కుమార్ నటిస్తారట. రెండో పార్ట్ లో బాలకృష్ణ, రజనీ కాంత్ నటిస్తారని తెలుస్తుంది. అటు రజనీకాంత్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య, రజనీ, శివన్న వంటి ముగ్గురు మాస్ హీరోలు కలిసి సినిమా అంటే దానిపై అంచనాలకే ఆకాశమే హద్దు కాబోతుంది.