దెబ్బలు తట్టుకోలేక బట్టలు లేకుండా పరిగెత్తాను... బాయ్ ఫ్రెండ్ చిత్ర హింసలపై నోరువిప్పిన బాలయ్య హీరోయిన్!

First Published Dec 8, 2022, 1:25 PM IST

నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆషా షైనీ తన బాయ్ ఫ్రెండ్ పై సంచలన ఆరోపణలు చేశారు. నమ్మి వస్తే కనికరం లేకుండా కొట్టాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. 
 

asha saini


ఇటీవల ఢిల్లీలో ఒక భయంకర సంఘటన చోటు చేసుకుంది. అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు తన ప్రేయసి శ్రద్దా వాకర్ ని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు. బంధువుల కంప్లైంట్ తో శ్రద్ధ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసిని అఫ్తాబ్ మట్టుబెట్టాడు. 
 


దేశవ్యాప్తంగా శ్రద్ధ మర్డర్ సంచలనం రేపింది. ఈ క్రమంలో హీరోయిన్ ఆశాషైనీ తాను కూడా బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురైనట్లు వెల్లడించారు. అతని చేతిలో తాను ఎంతటి నరకం అనుభవించారో చెప్పి బాధపడ్డారు. 
 

Flora saini


చండీఘర్ కి చెందిన ఆషా షైనీ అసలు పేరు ఫ్లోరా షైనీ. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆషా షైనీ 1999లో విడుదలైన ప్రేమ కోసం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. వినీత్ ఆ చిత్రంలో హీరోగా నటించారు. 
 


ఆషా షైనీ నటించిన ఫస్ట్ హిట్ మూవీ మనసున్న మారాజు. రాజశేఖర్ హీరోగా విడుదలైన ఈ చిత్రంలో ఆషా షైనీ ఒక హీరోయిన్ గా చేశారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కాగా... బాలకృష్ణ మరదలు పాత్ర చేశారు. బాలయ్య-ఆషా షైనీ పై చిత్రీకరించిన లక్స్ పాప సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్. 

asha saini


ఇక నువ్వు నాకు నచ్చావ్ మూవీలో తక్కువ నిడివి గల పాత్రలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. వెంకీ, పింకీ కాంబినేషన్ లో ఆషా షైనీ సీన్స్ భలే ఎంటర్టైన్ చేస్తాయి. గ్లామర్, టాలెంట్ ఉన్నా ఆషా షైనీకి అనుకున్న స్థాయిలో ఫేమ్ రాలేదు. 

సౌత్ ఇండియాలో పలు చిత్రాలు చేసిన ఆషా షైనీ... 2014 నుండి వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేశారు. అక్కడ ఆమె ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆషా షైనీ కనిపించిన చివరి చిత్రం 34 ఫార్మ్ హౌస్. 

కాగా ఆషా షైనీ ప్రియుడు గౌరంగ్ దోషి చేతిలో చిత్ర హింసలు అనుభవించారట. అతడు తనను తీవ్రంగా కొట్టేవాడట. గౌరంగ్ జోషి దెబ్బలకు ఒకసారి తన దవడ విరిగిపోయిందట. కనికరం లేకుండా తన్నేవాడట. ఒకరోజు తనకి భయపడి ఒంటిపై బట్టలు ఉన్నాయ్యో లేవో కూడా చూసుకోకుండా బయటకు పరుగెత్తిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ దారుణ సంఘటనలు ఆషా షైనీ బయటపెట్టారు. 2007లో ఈ సంఘటన జరినట్లు 2018లో ఆశా షైనీ వెల్లడించారు. గాయాలపాలైన తన ఫోటోలు విడుదల చేశారు. ఇటీవల ఆనాటి భయానక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు.

click me!