rashmi gautam, bullet bhaskar
Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షో దాదాపు 12ఏళ్లుగా తెలుగు ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుతుంది. వారానికి రెండు రోజులు నవ్వులు పూయిస్తుంది. ఇందులో ఆల్మోస్ట్ ప్రారంభం నుంచి యాంకర్గా రాణిస్తుంది రష్మి గౌతమ్.
ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్కి రష్మి వార్నింగ్ ఇచ్చింది. షోలోనే అందరి ముందు చెప్పు తెగుద్ది అంటూ హెచ్చరించడం వైరల్గా మారింది.
jabardasth varsha, bullet bhaskar
యాంకర్ రష్మి.. జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ వర్ష కలిసి కొత్తగా పెళ్లి చేసుకున్నారట. తమ పెళ్లికి జడ్జ్ లు ఖుష్బూ, శివాజీ వచ్చారు, కానీ రష్మి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వర్ష.
దీనికి భాస్కర్ రియాక్ట్ అవుతూ, మార్చి 1న మన పెళ్లి ఆ రోజు పెన్షన్ వచ్చే రోజు, కాబట్టి అవి తీసుకోవడానికి వెళ్లి ఉంటుంది అని తెలిపారు. దెబ్బకి రష్మి మొహం మాడిపోయింది. ఆ తర్వాత ఆమె కూడా మీరు పెన్షన్ మిస్ అయ్యారా అంటూ పంచ్ వేసింది.
rashmi gautam
ఆ తర్వాత జబర్దస్త్ వర్ష వెళ్లిపోయింది. భాస్కర్ ఒక్కడే ఉన్నాడు. రష్మి వైపు చూస్తూ సైగలు చేశారు. రమ్మంటూ ఆమెని సైగల్ చేయడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. మరో ఆలోచన లేకుండా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా రష్మి సైతం స్పందించింది. చెప్పు తెగుద్ది అంటూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చింది.
bullet bhaskar
అసలు నీకు సిగ్గు ఉందా? మీ ఇంట్లో అక్కా చెల్లెళ్లు లేరా? అంటూ నిలదీసింది. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదనేలా ఆమె గట్టిగానే హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా షో సీరియస్గా మారింది.
దీంతో బుల్లెట్ భాస్కర్ మాట మార్చేశాడు. దాన్ని పాజిటివ్ చేసే ప్రయత్నం చేశాడు. అక్కా చెల్లెళ్లు ఉన్నారు, వదిన లేదని బాధపడుతున్నామని కవర్ చేసుకున్నాడు. దెబ్బకి రష్మి నవ్వులు పూయించింది.