అనసూయ, రష్మీలను గెలికితే జైలుకే... కత్తి కట్టిన హాట్ యాంకర్స్!

Published : Apr 06, 2023, 04:42 PM ISTUpdated : Apr 06, 2023, 04:50 PM IST

ఒకప్పుడు సోషల్ మీడియా వేధింపులు సెలెబ్రిటీలు పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే మితిమీరిపోతున్న పక్షంలో చర్యలకు సిద్ధమవుతున్నారు.   

PREV
15
అనసూయ, రష్మీలను గెలికితే జైలుకే... కత్తి కట్టిన హాట్ యాంకర్స్!
Anasuya Bharadwaj

సోషల్ మీడియాలో యాంకర్స్ రష్మీ గౌతమ్, అనసూయ భారీ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. వారి డ్రెస్సింగ్, ఫోటో షూట్స్, వీడియోలను పై దారుణ కామెంట్స్ చేస్తుంటారు. అనసూయ రియాక్ట్ అవుతారు కానీ రష్మీ పెద్దగా పట్టించుకోరు. అయితే ఆమె కూడా పంథా మార్చింది. రష్మీ గౌతమ్ ని ఓ  నెటిజన్ దండం పెట్టి మరీ వేడుకున్నాడు. అయినా వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ లో కేసు పెడతానంటూ భయపెట్టింది. 

25
Rashmi Gautam

నెటిజన్ రష్మీ గౌతమ్ ని ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్ చేశాడు. చేయడమే కాకుండా ఆ కామెంట్ కి ఆమెను ట్యాగ్ చేశాడు. 'హైపర్ ఆదితో రష్మీ గౌతమ్ వైల్డ్ రొమాన్స్ చేస్తుంది. సుడిగాలి సుధీర్ తో  కేవలం టీఆర్పీ కోసం. నిజానికి రష్మీ ఆదిని ఎంతగానో ఇష్టపడుతుంది.. అని కామెంట్ పెట్టి రష్మీని ట్యాగ్ చేశాడు. ఈ ఇంస్టాగ్రామ్ పోస్ట్ మీద రష్మీ గౌతమ్ ఫైర్ అయ్యారు. గతంలో ఇలాంటి వేధింపులు సహించాను. చూసి చూడనట్టు వదిలేశాను. నా మీద ఆరోపణలు చేయడమే కాకుండా నన్ను ట్యాగ్ చేసేంత ధైర్యం చేశావంటే... ఇక ఉపేక్షించేది లేదు. దీనికి నువ్వు అనుభవిస్తావు అని కామెంట్ పెట్టింది. దాంతో భయపడిన నెటిజన్ కాళ్ళ బేరానికి వచ్చాడు. 
 

35
Rashmi Gautam

ఇకపై చేయను మేడమ్. నన్ను క్షమించండి. నాకు ఫ్యామిలీ ఉంది. ఈ ఒక్కసారికి మన్నించండి... అని దండం పెట్టి వేడుకున్నాడు. అయినా వదిలేది లేదు. నువ్వు ఈ క్షమాపణ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు చెప్పుకో అంటూ రష్మీ వార్నింగ్ ఇచ్చింది. సదరు నెటిజన్ రష్మీని బ్రతిలాడుతూ ఇంస్టాగ్రామ్ చాట్ చేశాడు. ఆ చాట్ హిస్టరీ స్క్రీన్ షాట్ తీసిన రష్మీ గౌతమ్... పోస్ట్ చేశారు. అలాగే ఈ వ్యక్తి మీద నేను చర్యలు తీసుకోవాలా వద్దా... అని ఒక పోల్ కూడా పెట్టింది. ఆమె ప్రశ్నకు నెటిజెన్స్ స్పందిస్తున్నారు. కొందరు ఈసారికి వదిలేయ్ మంటుంటే... ఇలాంటి వాళ్ళను వదలకూడదు. సరైన బుద్ధి చెప్పండి అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

45


కాగా వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించగా... రష్మీ గౌతమ్ మీద నెటిజెన్స్ విరుచుకుపడ్డారు. మీలాంటి వాళ్ళ వలనే కుక్కల నుండి రక్షణ లేకుండా పోతుందని ఆమెను ఏకిపారేశారు. కుక్కల ప్రాణాలకున్న విలువ మనుషులకు లేదా అని ప్రశ్నించారు. రష్మీ  యానిమల్ లవర్. వీధి కుక్కలపై దాడులను ఆమె వ్యతిరేకిస్తూ ఉంటారు . బాలుడి మరణించినప్పటికీ అది పేరెంట్స్ తప్పుగా రష్మీ మాట్లాడారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రలకు ఉందని రష్మీ చెప్పారు. ఈ ఘటనలో రష్మీపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఒకరైతే యాసిడ్ పోస్తానంటూ టెర్రర్ కి గురిచేశాడు. దీంతో ఉపేక్షించకూడని రష్మీ, అనసూయలాంటి వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. 
 

55

పరిస్థితులు చూస్తుంటే అనసూయ, రష్మీ ట్రోలర్స్ మీద కత్తికట్టినట్లు ఉన్నారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే జైలు పాలే అని హెచ్చరిస్తున్నారు. అనసూయ ఇప్పటికే చాలా మందిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపింది. ఆమెకు రష్మీ కూడా తోడైంది. కాబట్టి సెలెబ్రిటీల మీద కామెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే బెటర్... 
 

Read more Photos on
click me!

Recommended Stories