నాజూకు సొగసుల వయ్యారి భామ.. అందానికి అందం అద్దినట్టు ఉండే.. సొగసరి చిన్నది అనన్య పాండే. సోషల్ మీడియాలో వయ్యారాలు వడ్డించడంలో.. మిగిలిన హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదనేలా ఉంటోంది అనన్య పాండే ఫొటో షూట్. తాజాగా సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోలను షేర్ చేసిందీ ముద్దుగుమ్మ.
గ్రీన్ కలర్ టాప్, కాఫీ కలర్ ప్యాంట్ వేసుకున్న అనన్య తన స్లిమ్ ఫిట్ బాడీని ఎక్స్ పోజ్ చేస్తోంది. ఒక్కో స్టిల్ తో కుర్రాళ్ల మతి పోగోడుతోంది. సోషల్ మీడియాలో తను షేర్ చేసిన ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు అనన్య అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు తమ లైక్ లతో ఈ బ్యూటీ అందానికి ఓటు వేస్తున్నారు.
కాగా, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే(Ananya Pandey). చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్ లో ముందున్న అనన్య.. సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తుంది అనన్య.
కుర్రాళ్లు కోరుకునే నాజూకు అందం అనన్య(Ananya Pandey) సొంతం కాగా, ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ యూత్ ను అ్రట్రాక్ట్ చేస్తోంది. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ కేక్ లాంటి సొగసులతో కుర్రాళ్లను కట్టి పడేస్తుంది అనన్య. ట్రెండీ వేర్ లో అందాలు ఆరబోస్తోంది.
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ మూవీలో హీరోయిన్ గా అనన్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయదేవరకొండకు జంటగా ఆడిపాడనుంది. లైగర్ లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. విజయ్ దేవరకొండ అగ్రెసివ్ నెస్, అనన్య అందాలు, పూరీ మాస్ ఫ్రేమ్స్, సీన్స్, డైలాగ్స్ తో త్వరలో ఆడియోన్స్ ను అలరించనున్నారు. అయితే అంతకు ముందే బాలీవుడ్ లో ‘గహరాయిహ’ మూవీలో నటించింది.
కాగా ఆ మూవీ ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ మూవీలో రెండో ప్రధాన హీరోయిన్ పాత్ర పోషించిన పాండే తనవంతుగా మూవీ ప్రమోషన్ లో పాలుపంచుకుంటోంది. ఇందుకు తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్ తో అందరగొడుతూ... మూవీ ట్రైలర్ చూడాలంటూ ఆసక్తి కలుగజేస్తోంది. ఈ మూవీలో సిద్దాంత్ చతుర్వేది, అనన్యపాండే, దీపిక పడుకునే, ధైర్య కర్వ ప్రధాన పాత్రలో పోషించారు. శకున్ బత్రా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కాగా ఈ మూవీ ఓటీటీలో ఫిబ్రవరి 11 రిలీజ్ కానుందని, ఈ మూవీలో రజత్ కపూర్, నసీరుద్దీన్ షా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.