ఆ హీరోయిన్ తో నాగార్జునకి నిజంగానే ఎఫైర్ ఉందా ?.. అమల కామెంట్స్ ఇవిగో..

First Published Sep 19, 2022, 11:03 AM IST

నాగార్జున, టబు మధ్య చాలా కాలం ఎఫైర్ సాగింది అనే ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై టబు, నాగార్జున ఇద్దరూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. 

కింగ్ నాగార్జున ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి మన్మథుడే. అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టడం నాగ్ కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. తన గురించి ఎన్ని రూమర్స్ వినిపించినా నాగ్ మాత్రం పర్సనల్ విషయాల గురించి మీడియా ముందు ప్రస్తావించరు. 

నాగార్జున వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. అమలని రెండో వివాహం చేసుకున్నారు. వృత్తి పరంగా సిల్వర్ స్క్రీన్ పై ఎందరో హీరోయిన్లతో నాగ్ రొమాన్స్ చేశారు. నాగార్జున, రమ్యకృష్ణ.. నాగ్, టబు ల కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నాగార్జున, టబు గురించి దశాబ్దాలుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాం. 

నాగార్జున, టబు మధ్య చాలా కాలం ఎఫైర్ సాగింది అనే ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై టబు, నాగార్జున ఇద్దరూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని తెలిపారు. అయితే ఈ రూమర్స్ పై నాగార్జున సతీమణి అక్కినేని అమల తొలిసారి స్పందించారు. 'టబు నా భర్తకి మాత్రమే కాదు నాకు కూడా మంచి స్నేహితురాలు. వారిద్దరి మధ్య అంతకు మించి ఏమిలేదు' అని అమల తెలిపింది. 

మా ఇంట్లో ఏం జరుగుతుందో అని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా ఇల్లు దేవాలయంలాగా పవిత్రంగా ఉంటుంది. మా ఇంట్లో మా కుటుంబ వ్యవహారాలు మాత్రమే ఉంటాయి. కనీసం సినిమా గురించి కూడా చర్చ జరగదు. ఇలాంటి వాటి గురించి నాగ్, అమల ఇద్దరూ పట్టించుకోరు. పదే పదే దీని గురించి చర్చించడం వల్ల టబు బాధపడే అవకాశం ఉంది అని అమల అన్నారు. 

అలాగే టబు కూడా ఈ రూమర్స్ గురించి గతంలో కాఫీ విత్ కరణ్ షోలో స్పందించింది. నా గురించి, నాగ్ గురించి బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవం. నా విషయంలో ఈ రూమర్స్ ఎప్పుడూ ఉండేవే. విసిగిపోయాను. కానీ నాగార్జున నాకు స్నేహితుడు అని చిన్న మాటతో ముగించలేను. నాజీవితంలో ముఖ్యమైన వ్యక్తులలో నాగార్జున కూడా ఒకరు అని టబు తెలిపింది. 

నాగార్జున సతీమణే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. దీనితో ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడ్డట్లే. నాగార్జున, టబు కలసి నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రి లాంటి చిత్రాల్లో నటించారు. 

click me!