పొట్టి నిక్కరులో ప్రగ్యా జైశ్వాల్ థైస్ షో.. ఇంత అందాన్ని ముందు పెట్టుకొని నేచర్ ని చూసేదెవరు..

First Published Jun 6, 2023, 9:00 AM IST

గ్లామర్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తోంది. లేటెస్ట్ పిక్స్  తో మరింతగా ఆకట్టుకుంది.
 

‘అఖండ’తో భారీ సక్సెస్ ను అందుకుంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌ (Pragya Jaiswal) . దీంతో బాలయ్య హీరోయిన్ గా ముద్ర వేసుకుంది.  ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా జోష్ గా కనిపిస్తోంది. 
 

బాలయ్యకు జోడీగా నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. దీంతో బాలయ్యతో కలిసి రీసెంట్ గా ఓ యాడ్ షూట్ లోనూ నటించింది. ‘అఖండ’ తర్వాత వచ్చిన ‘సన్ ఆఫ్ ఇండియా’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ప్రగ్యాకు ఈ సినిమాతో పెద్దగా ఎఫెక్ట్ కనిపించడం లేదు. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఎలాంటి రోల్స్ కైనా ఓకే చెప్పే రకంగా కాకపోవడంతో ఈ బ్యూటీకాస్తా ఆలస్యంగానూ, తక్కువ చిత్రాలతోనూ ఇండస్ట్రీలో కెరీర్ ను సాగిస్తోంది. ప్రస్తుతం మాత్రం రూటు మార్చినట్టు కనిపిస్తోంది. 

ఈ సందర్భంగా మరిన్ని ఆఫర్లను దక్కించుకునేందుకు తనవంతు కృషి చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చూస్తోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ వస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

లేటెస్ట్ గా ప్రగ్యా జైశ్వాల్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పొట్టి నిక్కరు, అట్రాక్టివ్ టాప్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లోకేషన్ లో అందాలను ఆరబోసింది. థైస్ షోతో మతులు పోగొట్టింది.

అయితే నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో ప్రగ్యా నేచర్ కు దగ్గరగా ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అలాగే గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ , నెటిజన్లు లైక్స్ , కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ప్రగ్యా తదుపరి చిత్రంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. 
 

click me!