క్రేజీ హీరో శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేను శైలజ, చిత్రలహరి లాంటి హిట్ మూవీస్ తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్ కి తగ్గట్లుగా ఈ చిత్రంలో నటీమణులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.