కెరీర్ పాడు చేసుకున్న ఇలియానా, బాలయ్య హీరోయిన్.. మరికొందరు హీరోయిన్ల రాంగ్ డెసిషన్!

First Published Nov 29, 2019, 4:35 PM IST

హీరోయిన్లు కెరీర్ విషయంలో ప్లానింగ్ తో వ్యవహరించాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు స్టార్లుగా ఎదిగారు. కొందరు హీరోయిన్లు కెరీర్ జోరుమీదున్న సమయంలో టాలీవుడ్ ని వదిలి వెళ్లిపోయారు. అందుకు ఉదాహరణ ఇలియానానే. ఇంకొంత మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ ని వదలి బాలీవుడ్ బాట పట్టారు. అలాంటి హీరోయిన్ల కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో పరిశీలిద్దాం.. 

అమృత రావు : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి చిత్రంతో అమృత రావు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అతిథి చిత్రం పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత అమృత రావు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టలేదు. బాలీవుడ్ చిత్రాలకే ప్రాధాన్యత నిచ్చింది. అమృతకు తరచుగా బాలీవుడ్ లో కొన్ని ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది.
undefined
నేహా శర్మ : నేహా శర్మ టాలీవుడ్ లో ఓ అద్భుతమైన అవకాశంతో ఎంట్రీ ఇచ్చింది. రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుతలో నేహా శర్మ హీరోయిన్. చిరుత సూపర్ హిట్ గా నిలిచింది. కానీ నేహా శర్మ ఎక్కువరోజులు టాలీవుడ్ లో కొనసాగలేదు. నేహా శర్మ బాలీవుడ్ కు వెళ్లిపోవడంతో ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ పడింది. నేహా శర్మ బాలీవుడ్ లో రాణించలేకపోయింది. కానీ నేహా శర్మకు మాత్రం యువతలో మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో నేహా శర్మ యువతని ఆకర్షిస్తోంది.
undefined
ఇలియానా : టాలీవుడ్ ని వదలి బాలీవుడ్ కు వెళ్లాలనే ఇలియానా నిర్ణయం ఆమె కెరీర్ ని బాగా దెబ్బతీసింది. టాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ ఇలియానా ఎక్కువకాలం ప్రభావం చూపలేకపోయింది.
undefined
తాప్సి : తాప్సికి టాలీవుడ్ లో సరైన సక్సెస్ లేదు. దీనితో తాప్సి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ రాణిస్తోంది. బాలీవుడ్ లో తాప్సికి వరుస విజయాలు దక్కుతున్నాయి.
undefined
దిశా పటాని : దిశా పటాని పూరీజగన్నాధ్ దర్శత్వంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశపరిచినప్పటికీ దిశా గ్లామర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.
undefined
తనుశ్రీ దత్తా : మీటూ తో సంచలనం రేపిన తనుశ్రీ దత్తా బాలయ్య సరసన వీరభద్ర చిత్రంలో నటించింది. తనుశ్రీ ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైంది. బాలీవుడ్ లో కూడా ఆమెకు పెద్దగా కలసి రాలేదు.
undefined
కత్రినా కైఫ్ : టాలీవుడ్ ని వదలి బాలీవుడ్ కు వెళ్లడం అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్ కు బాగా కలసి వచ్చిందని చెప్పొచ్చు. కత్రినా కెరీర్ ఆరంభంలో మల్లీశ్వరి, అల్లరి పిడిగు లాంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి తిరుగులేని స్టార్ గా మారిపోయింది.
undefined
అయేషా టకియా : అయేషా టకియా పేరు చెప్పగానే నాగార్జున నటించిన సూపర్ మూవీ గుర్తొస్తుంది. చిత్రంలో అందాలు ఆరబోసిన అయేషా టాకియా ఓ బంపర్ ఆఫర్ ని వదిలేసుకుంది. మహేష్ నటించిన పోకిరి చిత్రానికి ముందుగా పూరి జగన్నాధ్ అయేషానే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అయేషా మాత్రం పోకిరిని రిజెక్ట్ చేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఒకేవేళ పోకిరి చిత్రంలో అయేషా నటించి ఉంటే ఆమె కెరీర్ ఇప్పుడెలా ఉండేదో ఊహించుకోండి..
undefined
ట్వింకిల్ ఖన్నా : తెలుగులో ట్వింకిల్ ఖన్నా నటించిన ఏకైక చిత్రం శీను. ఈ చిత్రం తర్వాత ట్వింకిల్ ఎక్కువగా టాలీవుడ్ ఫోకస్ పెట్టలేదు.
undefined
బిపాసా బసు : హాట్ బ్యూటీ బిపాసా బసు కెరీర్ ఆరంభంలో మహేష్ బాబు టక్కరి దొంగ చిత్రంలో నటించింది. తన గ్లామర్ తో బిపాసా బసు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
undefined
రైమా సేన్ : రైమా సేన్ నటించియున్న ఏకైక తెలుగు చిత్రం ధైర్యం. ఈ చిత్రం తర్వాత మరోసారి రైమా సేన్ తెలుగులో నటించలేదు. హిందీ, బెంగాలీ చిత్రాలపై ఫోకస్ పెట్టి అక్కడ సక్సెస్ సాధించింది.
undefined
click me!