కరోనా విరాళాలు: ప్రభాస్ బాహుబలి.. ఏ హీరో ఎంతంటే...

First Published Mar 29, 2020, 1:06 PM IST

విపత్కర సమయాల్లో తమ వంతు సాయం అందించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని మారు టాలీవుడ్ సినీ ప్రముఖులు నిరూపించుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇండియాలో కూడా కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు చేయూత అందించేందుకు, కరోనా వైరస్ నివారణ చర్యల్లో పాలు పంచుకునేందుకు టాలీవుడ్ హీరోలు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. 

ప్రభాస్: పీఎం రిలీఫ్ ఫండ్ కు 3 కోట్లు.. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు.. ప్రభాస్ మొత్తం 4 కోట్ల విరాళం అందించాడు.
undefined
పవన్ కళ్యాణ్ : పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ కోటి.. తెలుగు రాష్ట్రాలకు కోటి.. మొత్తం 2 కోట్ల విరాళం.
undefined
మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు.
undefined
అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు కలిపి రూ రూ 1.25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
undefined
చిరంజీవి: ఈ విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి రూ కోటి విరాళం ప్రకటించారు.
undefined
రామ్ చరణ్ : తాను పవన్ కళ్యాణ్ స్పూర్తితో కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 70 లక్షల విరాళం అందించబోతున్నట్లు రామ్ చరణ్ ప్రకటించాడు.
undefined
నితిన్ : టాలీవుడ్ కరోనాని ఎదుర్కొనేందుకు మొట్ట మొదట విరాళం అందించిన హీరో నితిన్. నితిన్ 10 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం అందించాడు.
undefined
ఎన్టీఆర్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ 70 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
undefined
సాయిధరమ్ తేజ్ : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 10 లక్షల విరాళం ప్రకటించాడు.
undefined
వరుణ్ తేజ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 20 లక్షల విరాళం అందజేయనున్నట్లు తెలిపాడు.
undefined
దగ్గుబాటి ఫ్యామిలీ : దగ్గుబాటి కుటుంబ సభ్యులు వెంకటేష్, సురేష్ బాబు, రానా కరోనా వైరస్ పై పోరాటం కోసం రూ కోటి విరాళం ప్రకటించారు.
undefined
నాగార్జున: కరోనా ప్రభావంతో పనిలేకుండా పోయిన సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు కింగ్ నాగార్జున రూ 1 కోటి విరాళం ప్రకటించాడు.
undefined
కొరటాల శివ, త్రివిక్రమ్ : ఇక దర్శకులు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేయూత అందించేందుకు ముందుకు వస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 లక్షలు.. కొరటాల శివ, అనిల్ రావిపూడి రూ 10 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు.
undefined
అశ్విని దత్, దిల్ రాజు : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు 20 లక్షలు, అశ్విని దత్ 20 లక్షల విరాళాలను తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు.
undefined
అక్షయ్ కుమార్ : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ని మరువడానికి లేదు.. అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్ల భారీ విరాళం ప్రకటించి తన ఉదారతని చాటుకున్నాడు. అంతటి భారీ విరాళం ప్రకటించినందుకు గాను అక్షయ్ ని ప్రధాని మోడీ అభినందించారు.
undefined
click me!