అటకెక్కిన స్టార్ హీరోల సినిమాలు.. ఆడియన్స్ కి షాక్!

First Published Oct 30, 2019, 11:57 AM IST

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన తరువాత ఇతర కారణాల వలన సెట్స్ పైకి వెళ్లలేదు. 

టాలీవుడ్ లో కొన్ని సినిమాలు అనౌన్స్ చేసిన తరువాత ఇతర కారణాల వలన సెట్స్ పైకి వెళ్లలేదు. మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో, మరికొన్ని సెట్స్ పైకి వెళ్లిన తరువాత ఆగిపోయాయి. అలా ఆగిపోయిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
undefined
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 'జనగణమన' అనే సినిమా తీయలనుకున్నారు. కానీ ఆ సినిమా మొదలవ్వక ముందే ఆగిపోయింది.
undefined
మహేష్ బాబు, నాగార్జున మల్టీస్టారర్ గా మణిరత్నం ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ నాగార్జున ఆసక్తి చూపకపోవడంతో మణిరత్నం ఈ సినిమా ఆలోచన పక్కన పెట్టేశారు.
undefined
బాలకృష్ణ, కృష్ణవంశీ కాంబో లో తెరకెక్కాల్సిన సినిమా కాల్షీట్స్ కారణంగా సెట్స్ పైకి వెళ్లలేదు. బాలయ్య వందో సినిమాగా ఇదే రావాల్సింది కానీ సెట్ కాలేదు.
undefined
బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ 'నర్తనశాల' సినిమాను తన సొంత డైరెక్షన్ లో మొదలుపెట్టాడు. ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఇందులో సౌందర్య కూడా నటించింది. కానీ కొన్ని కారణాల వలన సినిమా ఆగిపోయింది.
undefined
బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో 'విక్రమసింహా భూపతి' అనే సినిమా తీయాలనుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిపారు. కానీ ఆ తరువాత సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేశారు.
undefined
బాలకృష్ణ, బి గోపాల్, బెల్లంకొండ సురేష్ ల కాంబినేషన్ లో 'హరహర మహాదేవ' అనే సినిమా మొదలుకావాలి. కానీ సెట్స్ పైకి వెళ్లకముందే సినిమా ఆగిపోయింది.
undefined
చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో 'వినాలని వుంది' అనే సినిమా చేయాలనుకున్నారు. కొన్ని పాటల చిత్రీకరణ కూడా జరిగింది. కానీ అదే సమయంలో వర్మకి బాలీవుడ్ ఆఫర్ రావడంతో ఈ సినిమా వదిలేసి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు.
undefined
చిరంజీవి, సింగీతం శ్రీనివాస్ కాంబినేషన్ లో 'భూలోక వీరుడు' అనే సినిమా రావాలి. సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ రషెస్ చిరుకి నచ్చకపోవడంతో సినిమా ఆపేశారు.
undefined
వెంకటేష్, మారుతి కాంబినేషన్ లో 'రాధ' అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. నయనతార హీరోయిన్ గ సినిమా లాంచ్ చేశారు. కానీ సినిమా కథ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో ఆగిపోయింది.
undefined
దర్శకుడు క్రిష్.. వెంకీ హీరోగా 'వీరయ్య' అనే సోషియో ఫాంటసీ సినిమా తీయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సినిమా ఆగిపోయింది.
undefined
'ఆడాళ్లు మీకు జోహారులు' ఈ టైటిల్ తో దర్శకుడు కిషోర్ తిరుమల, వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా రావాల్సివుంది. కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
undefined
వెంకటేష్, దర్శకుడు వంశీ కాంబినేషన్ లో 'గోలిపురం రైల్వే స్టేషన్' అనే కామెడీ సినిమా రావాలి. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు
undefined
పవన్ కళ్యాణ్ దర్శకుడిగా, నటుడిగా 'సత్యాగ్రహి' అనే సినిమా తీయాలనుకున్నాడు. ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మించాల్సివుంది. కానీ ఇది వర్కవుట్ కాలేదు.
undefined
పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో జీసస్ చరిత్ర ఆధారంగా 'జీసస్ క్రైస్ట్' అనే సినిమా రావాల్సివుంది. అయితే పవన్ అభిమానులకు ఈ విషయం నచ్చకపోవడంతో సినిమాని మొదలుపెట్టక ముందే ఆపేశారు.
undefined
రామ్ చరణ్, కాజల్ జంటగా తమిళ దర్శకుడు ధరణి 'మెరుపు' అనే సినిమా తీయాలనుకున్నాడు. పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.
undefined
రామ్ చరణ్, కొరటాల శివ కాంబోలో సినిమా మొదలై సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
undefined
click me!