అతడితోనే ఉండుంటే సావిత్రికి పట్టిన గతే నాకు.. సిద్ధార్థ్ పై సమంత సంచలనం

First Published Mar 18, 2020, 10:02 PM IST

అక్కినేని సమంత ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్. సాధారణంగా వివాహం జరిగాక హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుందనే వాదన ఉంది.

అక్కినేని సమంత ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్. సాధారణంగా వివాహం జరిగాక హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుందనే వాదన ఉంది. కానీ అందుకు సమంత భిన్నం. వివాహం తర్వాత కూడా సమంత మహానటి, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.
undefined
సమంత సంధర్భం వచ్చినప్పుడు ఎలాంటి విషయం గురించి అయినా మాట్లాడేందుకు వెనుకాడదు. అవసరమైనప్పుడు వ్యక్తిగత విషయాలని కూడా బయటపెడుతుంది.  2017లో సమంత, నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏ మాయ చేసావే చిత్రంతో మొదలైన వీరిద్దరి పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది.
undefined
ప్రస్తుతం సామ్, చైతు అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా హీరో సిద్దార్థ్ తో సమంత ఒకానొక సమయంలో ఎఫైర్ సాగించిందనే ప్రచారం ఉంది. ఇంతవరకు సమంత కానీ, సిద్దార్థ్ కానీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఓ సమయంలో వీరిద్దరూ కలసి పూజలు కూడా చేశారు. తాజాగా సిద్దార్థ్ గురించి సమంత ఓపెన్ ఐంది.
undefined
సిద్దార్థ్ తో రిలేషన్ షిప్ పై సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. 'సిద్దార్థ్ తో నా రిలేషన్ షిప్ ఒక చేదు అనుభవం. ఆ రిలేషన్ షిప్ అలాగే కొనసాగి ఉంటే మహానటి సావిత్రి గారి పరిస్థితే నాకు ఎదురయ్యేది. ఆ ప్రమాదాన్ని నేను వెంటనే గ్రహించి అతడితో బ్రేకప్ చేసుకున్నట్లు సమంత తెలిపింది.
undefined
అదృష్టం కొద్దీ నాగ చైతన్య నాకు భర్తగా వచ్చాడు. అని విషయాల్లో చైతు రత్నం లాంటోడు అంటూ సమంత ప్రశంసలు కురిపించింది. కెరీర్ పరంగా కూడా చైతు సామ్ సక్సెస్ ఫుల్ జోడి. వీరిద్దరూ కలసి నటించిన ఏ మాయ చేసావే, మజిలీ, మనం లాంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
undefined
వివాహం తర్వాత సామ్ సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటోంది. ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా సామ్ సత్తా చాటింది.
undefined
click me!