సాయిధరమ్ తేజ్ లైఫ్ లో చేదు సంఘటన.. తన తల్లి డివోర్స్ కి కారణం ?

First Published Apr 24, 2020, 3:22 PM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన కెరీర్ ఆరంభంలో దూసుకుపోయాడు. పిల్లా నువ్వు లేనిజీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి వరుస విజయాలతో సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తన కెరీర్ ఆరంభంలో దూసుకుపోయాడు. పిల్లా నువ్వు లేనిజీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి వరుస విజయాలతో సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలికలు తేజులో స్పష్టంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి.
undefined
కానీ ఆ తర్వాత పరాజయాలతో తేజు కెరీర్ నెమ్మదించింది. ఒక దశలో తేజు కెరీర్ ని వరుసగా ఎదురవుతున్న ప్లాపులు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఎట్టకేలకు తేజు తిరిగి పుంజుకున్నాడు. తేజు చివరగా నటించిన చిత్రలహరి, ప్రతిరోజూ పండగే చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
undefined
దీనితో తేజు కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కింది. ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలు సాయి ధరమ్ తేజ్ తన జీవితంలోని మరో సైడ్ గురించి వివరించాడు. తన లైఫ్ లో తీపి మాత్రమే కాదు చేదు కూడా ఉందని తెలిపాడు. తన తల్లి దండ్రులు డివోర్స్ తో విడిపోవడం తన లైఫ్ లో శాడ్ పార్ట్ అని తేజు తెలిపాడు.
undefined
తాను పదో తరగతిలో ఉండగా తన తల్లి దండ్రులు విభేదాలతో విడిపోయారని తెలిపారు. వారిద్దరికీ సరిపడలేదు.. అందుకే విడిపోయారు. ఏమైనా అది అది పాస్ట్.. గడిచిపోయింది. కానీ అమ్మైనా నన్నైనా నాకు అమ్మే. నన్ను, తమ్ముడిని ఏ లోటూ రాకుండా పెంచింది అని తేజు వివరించాడు.
undefined
ఆ తర్వాత కొంత కాలానికి అమ్మ రెండో వివాహం చేసుకుందని తేజు తెలిపాడు. ఆయన మంచి వ్యక్తి, ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు అని తేజు తెలిపాడు.
undefined
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
undefined
click me!