తాను తప్పు చేశానంటూ బహిరంగంగా ఒప్పుకున్న యాంకర్ రష్మీ

First Published Mar 21, 2020, 2:48 PM IST

రష్మీ గౌతమ్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. కరోనా దృష్ట్యా పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనవద్దని ఆంక్షలు విధిస్తున్న తరుణంలో శుక్రవారం రష్మీ రాజమేహేంద్రవరంలోని ఒక షాప్ ఓపెనింగ్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దీంతో వందల సంఖ్యలో జనులు రష్మిని చూసేందుకు ఎగబడ్డారు.

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. కరోనా దృష్ట్యా పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనవద్దని ఆంక్షలు విధిస్తున్న తరుణంలో శుక్రవారం రష్మీ రాజమేహేంద్రవరంలోని ఒక షాప్ ఓపెనింగ్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
undefined
దీంతో వందల సంఖ్యలో జనులు రష్మిని చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వెంటనే విషయంపై రష్మి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
undefined
ముందుగా అభిమానులకు క్షమాపణ చెప్పిన రష్మీ.. ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అక్కడికి జనాలు ఎక్కువగా రారేమో అనుకున్నాం, ఎక్కువ మంది జనాలు రావాలని కూడా అనుకోలేదు. ఇక ముందుగానే స్టోర్ ఓపెనింగ్ కి పర్మిషన్ తీసుకున్నాం.
undefined
ఎన్నో రోజుల క్రితం నేను ఆ డీల్ పై ఒప్పందం కుదర్చుకున్నాను. అందుకే అక్కడికి రావాల్సివచ్చింది.కొన్ని జాగ్రత్తలు తీసుకొని జనాలు రాకుంటేనే మంచిదని అనుకున్నాం. కానీ అక్కడికి వందల సంఖ్యలో జనాలు వచ్చారు. అక్కడ ఎవరికి కూడా కరోనా పై అవగాహన లేదని తెలుస్తోంది.
undefined
వెంటనే అక్కడి నుంచి పోలీసులు వారిని పంపేశారు. ఇది అనుకోకుండా జరిగిన పరిణామం. దయచేసి ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే మన్నించగలరని కోరుకుంటున్నా ' అని రష్మీ వివరణ ఇచ్చారు.
undefined
click me!