గాడ్సే విషయంలో నాగబాబుకు ఆర్జీవీ సపోర్ట్.. తొక్కిపెట్టారు అంటూ సంచలనం

First Published May 20, 2020, 4:45 PM IST

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సే అంశం మరోమారు చర్చకు వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం విభిన్న వాదనలకు కారణం అవుతోంది. నాగబాబుని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సే అంశం మరోమారు చర్చకు వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబుచేసిన ట్వీట్ ప్రస్తుతం విభిన్న వాదనలకు కారణం అవుతోంది. నాగబాబుని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. మే 19న గాడ్సే పుట్టినరోజు సంధర్భంగా నాగబాబు అతడిని గుర్తు చేసుకున్నారు. అతడిని దేశభక్తుడని అభివర్ణించాడు.
undefined
గాడ్సే గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు యథాతధంగా..ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది డిబేటబుల్. కానీ అతని వైపు ఆర్గుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).
undefined
గాంధీ ని చంపితేఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని నాగబాబుగాడ్సే గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
undefined
నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలువిమర్శలకు, తీవ్రమైన చర్చకు దారి తీశాయి. గాడ్సే విషయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నాగబాబుని సపోర్ట్ చేసారు. గాడ్సే దేశభక్తుడే అని అందులో ఎలాంటి డౌట్ లేదని వర్మ అన్నాడు.
undefined
నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ఓ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ.. నాగబాబు గారు చెప్పింది 100 శాతం కరెక్ట్. గాడ్సే గురించి చిన్నప్పుడు ఒక విలన్ గానే భావిస్తూచదువుకున్నాం. ఎవరో ఉన్మాది, టెర్రరిస్ట్గాంధీని చంపేశాడు అని అనుకున్నాం. కానీ ఎందుకు చంపాడనేది ఎక్కడా లేదు.
undefined
హత్య చేయడం క్రిమినల్ చర్య. అలాగే ఎందుకు చంపాడనే విషయాన్ని కూడా చర్చించాలి. 99శాతం మంది ప్రజలకు గాడ్సే గాంధీని ఎందుకు చంపాడనేది తెలియదు. వాస్తవానికి గాడ్సే గాంధీ అభిమాని. ఇండియాలో హిందూ ముస్లిం వివాదం తెరపైకి వచ్చినప్పుడు గాంధీ తప్పు చేస్తున్నారనిగాడ్సే భావించాడు.
undefined
స్వాతంత్రం వచ్చింది.. ఇండియా నుంచి పాక్ విడిపోయింది. గాడ్సే కోరుకున్నవి రెండూ జరిగిపోయాయి. అయినా కూడా గాంధీనిఎందుకు చంపాల్సి వచ్చింది.. దానికి ఒక వాదన ఉందని వర్మ అన్నారు. ఇండియా పాక్ విడిపోయినప్పుడు.. ఖజానాలోని 50 శాతం నిధులుపాక్ కి ఇవ్వడానికి గాంధీ అంగీకరించారుఅనే వాదన ఉంది. ఈ అంశంలో గాంధీకి అడ్డు చెప్పలేక సర్ధార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారంతా మొహమాటపడ్డారని అంటారు.
undefined
ఈ విషయంలో గాంధీతోవిభేదించడంలో తప్పులేదు.. కానీ హత్య చేయడంకరెక్ట్ కాదు అని వర్మ అన్నారు. ఆ సమయంలో గాడ్సే కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ ని బయటకు రానివ్వలేదు. ఎందుకంటే అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చి, గాంధీ మరణించిన పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదని అప్పటి పెద్దలు భావించినట్లు వర్మ అన్నారు. అందువల్లే గాడ్సే వాదనని తొక్కిపెట్టారు.
undefined
దేశభక్తి విషయంలో గాడ్సే గురించి నాగబాబు చెప్పింది కరెక్ట్ అని వర్మ అన్నారు. మొత్తంగా నాగబాబు కామెంట్స్ పెద్ద కలకలమే సృష్టిస్తున్నాయి.
undefined
click me!