సినిమా వాళ్ళకు పద్మ అవార్డ్ ల పంట, బాలయ్య తో పాటు ఎవరెవరిని వరించాయంటే..?

Published : Jan 25, 2025, 10:08 PM IST

రిపబ్లిక్ డే సందర్భంగా పద్మా అవార్డ్ లను ప్రకటించింది క్రేంద్ర ప్రభుత్వం. ఇందులో సినితారలు కూడా ఉన్నారు. తెలుగులో బాలకృష్ణతో పాటు.. ఎవరెవరికిని పద్మ అవార్డ్ లు వరించాయంటే..?   

PREV
15
సినిమా వాళ్ళకు పద్మ అవార్డ్ ల పంట, బాలయ్య తో పాటు ఎవరెవరిని వరించాయంటే..?

కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డ్ లను  ప్రకటించింది. అన్ని రంగాలలో సేవ చేసిన వారికి ఈ అవార్డ్ లు ప్రకటిస్తారు. కాగా సినీరంగానికి చెందిన ప్రముఖులకు పద్మభూషన్ తో పాటు కొద్దిమంది స్టార్స్ కు పద్మశ్రీ అవార్డ్ లు కూడా వరించాయి. అయితే తెలుగుతో పాటు తమిళ,మలయాళ పాపులర్ స్టార్స్ ను పద్మవిభూషన్ వరించడం విశేషం. 
 

25

పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ను పద్మ భూషన్ అవార్డ్ వరించింది. సినిమా రంగంలో దాదాపు 50 ఏళ్ళుగా ఆయన చేస్తున్న సేవకు గానే బాలయ్య ను పద్మభూషన్ తో సత్కరించబోతున్నారు. తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా అడుగు పెట్టి.. హీరోగా కెరీర్ ను కంటీన్యూ చేస్తూ..

దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన బాలయ్య.. పొలిటికల్ గా కూడా యాక్టీవ్ గా ఉన్నాడు. మూడు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచిన ఆయన.. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సమాజ సేవ కూడా చేస్తున్నాడు. 

35

ఇక పద్మ అవార్డ్ వరించిన వారిలో తమిళనాడు కోటా నుంచి స్టార్ హీరో అజిత్ కూడా ఉన్నారు. తమిళ సినిమాలో స్టార్ గా కొనసాగుతున్న ఆయన.. నటనతో పాటు స్పోర్డ్స్ లో కూడా యాక్టీవ్ గా ఉన్నారు. మరీముఖ్యంగా రేసింగ్స ఫీల్డ్ లో అజిత్ అనుభవం అపారం. రీసెంట్ గా కార్ రేసింగ్ లో మూడో స్థానంలో నిలిచారు. ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ.. హీరోగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న అజిత్ కు పద్మ భూషన్ అవార్డ్ వరించింది.
 

45

ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన ను కూడా పద్మ భూషన్ వరించింది. ఆమె  కూడా అందరికి సుపరిచితురాలే. హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరించిన శోభన.. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు, రజినీకాంత్, మోహన్ లాల్, లాంటి  స్టార్స్ తో కలిసి మెరిసింది. హీరోయిన్ గా మాత్రమే కాదు క్లాసికల్ డాన్సర్ గా కూడా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న శోభన.

ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు. పెళ్ళి  కూడా చేసుకోకుండా తన జీవితాన్ని డాన్స్ కు అంకితం చేశారు. క్లాసికల్ డాన్స్ షోలు చేస్తూ.. డాన్స్ స్కూల్ నడిపిస్తూ.. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ..గడిపేస్తున్నారు. ఆమె కళా రంగానికి చేసిన సేవకుగాను గౌరవంగా పద్మ అవార్డ్ అదించబోతున్నారు. 

55
Anant Nag

ఇక వీరితో పాటు బాలీవుడ్ నటుడు, దర్శకుడు. మల్టీ టాలెంటెడ్ శేఖర్ కపూర్ ను కూడా ఈ అవార్డ్ వరించింది. ఆయన సినిమా రంగంలోనే అనేక విభాగాల్లో పనిచేశారు. దర్శకుడిగా, నటుడిగా తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు.

ఇక శేకర్ కపూర్ తో పాటు కన్నడ  నటుడు అనంత్ నాగ్ కూడా పద్శ భూషన్ వరించింది. ఆయన కన్నడ తో పాటు తెలుగు, తమిళ , హిందీ భాషల్లో నటించి మెప్పించారు. 1973 నుంచి ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎంతో మంది పెద్ద తారలోకలిసి నటించిన ఆయన కన్నడ నాట పొలిటీషియన్ గా కూడా కొనసాగుతున్నారు.

వీరితో పాటు హిందీ సింగర్ అర్జిత్ సింగ్, పంజాబీ గాయకుడు.. ఇలా మారాఠ నటులు కొంత మందిని పద్మశ్రీ అవార్డ్ వరించాయి. 

click me!

Recommended Stories