కృష్ణ వంశీ కొత్త సినిమా ప్రకటన, కొన్ని కామెంట్స్!

First Published Oct 17, 2019, 9:43 AM IST

మరాఠీ సినిమా ‘నటసామ్రాట్‌’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ రీమేక్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. 

చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కొత్త ప్రాజెక్టు ని ప్రకటించారు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్‌’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ రీమేక్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. రెడ్‌బల్బ్‌ మూవీస్‌, హౌస్‌ఫుల్‌ మూవీస్‌, ఎస్వీఆర్‌ గ్రూప్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ‘రంగమార్తాండ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
undefined
నానా పటేకర్ సినిమా : 2016లో వచ్చిన మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’కి మహేష్‌మంజ్రేకర్‌ దర్శకత్వం వహించగా, నానా పాటేకర్‌ ప్రధాన పాత్రను పోషించి, మరీ నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. కృష్ణవంశీ ఈ చిత్రానికి తెలుగుదనం తెచ్చే పనిలో స్క్రిప్టుని గత కొంతకాలంగా మెరుగులు దిద్దారు.
undefined
స్టోరీ లైన్ : సినిమా నటుడిగా రిటైరైన వ్యక్తి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత తన సినీజీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సతమతమయ్యే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
undefined
నెగిటివ్ కామెంట్స్ : అయితే క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ వంటి డైరక్టర్...ఇలా రీమేక్ చేయటమేంటి అని నెగిటివ్ కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. దానికి తోడు ప్రకాష్ రాజ్ సోలోగా చేసిన సినిమాలు ఏమీ ఆడలేదని, ఎందుకిలా రిస్క్ చేస్తున్నారని అంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంటుందని అభిమానులు భావిస్తున్నారు.
undefined
వర్మ శిష్యుడుగా మొదలెట్టి : రామ్ గోపాల్ వర్మ శిష్యునిగా ‘గులాబి’తో దర్శకుడైన కృష్ణవంశీ నుంచి ‘నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి, అంత:పురం, సింధూరం, సముద్రం’ వంటి భాక్సాఫీస్ హిట్ చిత్రాలు వచ్చాయి. అలాగే ‘శ్రీఆంజనేయం, చక్రం, డేంజర్‌’ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడకపోయినా కూడామంచి పేరునే సాధించాయి. ఆయనకు చివరగా వచ్చిన హిట్ 2007లో వచ్చిన ‘చందమామ’.
undefined
చరణ్ ఆఫర్ ఇచ్చినా : కానీ ఆ తర్వాత ‘శశిరేఖాపరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరి వాడేలే, నక్షత్రం’ ఇలా ఫ్లాఫ్ బాట పట్టారు. రామ్‌చరణ్‌ వంటి హీరో పిలిచి డేట్స్ ఇచ్చినా ‘గోవిందుడు అందరి వాడేలే’తో సువర్ణావకాశం పాడు చేసారన్నారు.
undefined
బాలయ్యతోనూ కలిసి రాలేదు: ఇక పైసా, మొగుడు, నక్షత్రం వంటి సినిమాలు రిలీజుకే నానాతంటాలు పడ్డాయి. ఇక బాలయ్య తో ‘రైతు’ చేద్దామని చూసినా బిగ్‌బి అమితాబ్‌ని కీలకపాత్ర కోసం ఒప్పించ లేకపోవడంలో ఆ ఆఫర్ ని చేజార్చుకున్నాడు. దీంతో ఇక సొంత కథలపై నమ్మకం వదిలేశాడో ఏమో గానీ ఈ సారి మాత్రం ఈ రీమేక్‌తో వస్తున్నాడు.
undefined
ప్రకాష్ రాజ్ ఆలోచనే.. : గతంలో మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించిన సినిమాను ధోని పేరుతో సౌత్లో రీమేక్ చేసిన ప్రకాష్ రాజ్, మరోసారి తానే దర్శక, నిర్మాతగా ప్రధానపాత్ర పోషిస్తూ నటసామ్రాట్ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే తన దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా ఆడకపోవటం... మనవూరి రామాయణం సినిమా డిజాస్టర్ అవటంతో కృష్ణవంశీని ఈ సినిమా చేయమని అడిగారని తెలుస్తోంది.
undefined
click me!