రష్మికకి అన్ని కోట్ల ఆస్తులా..? అంతా షాక్

First Published Jan 22, 2020, 1:19 PM IST

రీసెంట్ గా రష్మికకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సొంతూరు కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించి.. రష్మిక నివాసం నుంచి ఐటీ అధికారులు కొత్త మొత్తం నగదు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

పళ్లున్న చెట్టుకే రాయి దెబ్బలు అన్నట్లు స్టార్ స్టేటస్ తో పాటు అనేక సమస్యలు, రూమర్స్ ,రచ్చలు వస్తూంటాయి. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో..ఏ సమయానికి మీడియా ఎలా స్పందిస్తుందో ఎవరి అంచనాలకీ దొరకదు.
undefined
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందన పరిస్దితి అదే. ఆమెపై కన్నడ మీడియాలో వార్తల వర్షం కురుస్తోంది. దాన్ని తెలుగు మీడియా అందుకుని అప్ డేట్స్ ఇస్తోంది.
undefined
రీసెంట్ గా రష్మికకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సొంతూరు కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించి.. రష్మిక నివాసం నుంచి ఐటీ అధికారులు కొత్త మొత్తం నగదు, డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.
undefined
. అయితే ఆ దాడి జరిగింది ఆమె మీద కాదని ఆమె తండ్రి మీద అని ఆ తర్వాత వార్తలు వచ్చాయి.
undefined
ఈ వార్తల నేపధ్యంలోనే కన్నడ మీడియాలో మరో వార్త స్ప్రెడ్ అవటం మొదలెట్టింది. అదేమిటంటే...రష్మికకు 250 కోట్ల దాకా ప్రాపర్టీ ఉందని, అది ఈ ఐటీ దాడిలో బయటపడిందనీను.
undefined
దాంతో అసలు రష్మిక సినిమాల్లోకి వచ్చిన ఈ కొద్ది సమయంలోనే అంత ఎలా సంపాదించగలదు అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో,తెలుగు మీడియాలోనూ రచ్చ మొదలైంది. కన్నడ మీడియా చెప్పేదాని ప్రకారం..ఆమె పేరు మీద ఆస్దులకు సంభిందించిన డాక్యుమెంట్స్ అనేకం ఈ దాడిలో బయిటకు వచ్చాయిట.
undefined
రష్మిక తాజాగా మహేష్‌తో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దాంతో అందరి దృష్టీ ఆమెపై ఉంది.
undefined
ఈ నేపధ్యంలో వస్తున్న ఈ వార్తలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేకపోతే ఖచ్చితంగా కన్నడ మీడియా ఎందుకిలా ప్రచారం చేస్తోందో తెలుసుకోవాల్సిన అవసరం రష్మికకు ఉంది.
undefined
click me!