ఆ 5 కోట్లు ఏమయ్యాయి, చిరంజీవి కూడా వెళ్ళాడుగా.. బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

First Published Jun 2, 2020, 10:28 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక అభిమానులైతే.. నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని.. మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇక అభిమానులైతే.. నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని.. మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ప్రారంభించేలా అనుమతులు ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి విన్నవించుకున్నారు.
undefined
చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రముఖులంతా మంత్రి తలసానితో కలసి సీఎం కేసీఆర్ ని కలిశారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో కూడా వీరంతా తలసానితోచర్చలు జరిపారు. ఈ తనని ఎవరూ ఆహ్వానించలేదని, వీళ్లంతాభూములు పంచుకుంటున్నారు అని బాలయ్య కామెంట్స్ చేయడంతో దుమారం మొదలయింది.
undefined
తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ పై మరోసారి విరుచుకుపడ్డారు. తానూ చిత్ర పరిశ్రమకు చేసిన కార్యక్రమాలలోఎక్కువగా ఇన్వాల్వ్ కానని, అందుకు గల కారణాన్ని బాలయ్య వివరించారు. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ తో లింక్ పెడుతూచిరంజీవిపై బాలయ్య చేసిన కామెంట్స్ మరోమారుతీవ్ర వివాదంగామారేలా ఉన్నాయి.
undefined
ఇంతకీ బాలయ్య ఏమన్నాడంటే.. మా అసోషషన్కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. చాలా రోజులుగా చెబుతున్నారు. ఏమన్నా జరిగిందా.. అంతా కలసి అమెరికాలోఈవెంట్లు పెట్టుకున్నారు. నన్నెవరూ పిలవలేదు.
undefined
డల్లాస్ లో ఈవెంట్ జరిగింది. ఐదు కోట్లు నిధులు వచ్చాయి అన్నారు. చిరంజీవి కూడా వెళ్లారు కదా.. ఆ 5 కోట్లు ఏమయ్యాయి అని బాలయ్య ప్రశ్నించారు. అందుకే ఇలాంటి వ్యవహారాల్లో నేను ఇన్వాల్వ్ కాను.
undefined
ఆర్టిస్ట్ అంటే పువ్వుతో సమానం. ఎప్పుడూ ప్రకాశవంతంగా అందంగా ఉండాలి. ఇలాంటి తలనొప్పులు ఎందుకు.. వీళ్లంతా ఏమైనా బిల్డింగ్ కట్టారా అని బాలయ్య ప్రశ్నించారు. కాని పనికి నేను వెళ్ళను. ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నప్పుడు 3 ఎకరాలు ఫ్రీగా ఇవ్వదా.. ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తోందిగా అని బాలయ్య వ్యాఖ్యలు చేశాడు.
undefined
ఇప్పుడు అంతా కలసి సినిమా షూటింగ్స్ వెంటనే ప్రారంభించేయాలి అని ఆరాటపడిపోతున్నారు. కారణం ఏంటో అందరికీ తెలుసు.. టాక్సులు.. డబ్బు అని బాలయ్య అన్నారు. కరోనా ప్రభావం ఉండగానే షూటింగ్స్ మొదలు పెట్టడం ఎందుకు అని బాలయ్య ప్రశ్నించారు.
undefined
అత్యధికంగా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి టాక్సులు వెళుతున్నాయి. కానీ ఒక్క బిల్డింగ్ కట్టలేదు. చెన్నైలో చూడండి.. వాళ్లే సొంతంగా భవనం నిర్మించుకున్నారు. అలాంటి ఆలోచన ఇక్కడ ఎవ్వరికి రావు అని బాలయ్య మొదట బిల్డింగ్ కోసం 5 కోట్లు అన్నారు.. ఆ తర్వాత కోటి అంటున్నారు.. మిగిలిన నాలుగు కోట్లు ఏమైనట్లు అని బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
undefined
ఈ లెక్కలన్నీ తలనొప్పి.. అందుకే పట్టించుకోను. హిపోక్రసీ, సైకో ఫ్యాన్సీ ఎక్కువ.. కొందరు మైకులు చూడగానే పిచ్చోళ్ళలాగా ఊగిపోతుంటారు అని బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
undefined
click me!