రాశి ఖన్నా, స్టార్ హీరోకి అలా జరగడం ఖాయం.. జ్యోతిష్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

First Published Mar 12, 2020, 4:48 PM IST

భారత ప్రజలు జ్యోతిష్యాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతారు.

భారత ప్రజలు జ్యోతిష్యాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతారు. తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యస్త్రంలో ప్రావీణ్యులైన పండితులు చాలా మందే ఉన్నారు.
undefined
ఎన్నికల సమయంలో, క్రికెట్ మ్యాచ్ ల సందర్భంలో, ఇతర ప్రత్యేక పరిస్థితుల్లో జ్యోతిష్యులు తమ అంచనాలని బయట పెడుతారు. మా అంచనాలు నిజమయ్యాయని పలు సందర్భాల్లో జ్యోతిష్యులు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గుర్తింపు పొందారు.
undefined
తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం సమీపిస్తున్న తరుణంలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత కొత్త సంవత్సరంలో కొన్ని అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయి అంటూ సినీ రాజకీయ ప్రముఖుల గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
undefined
ఉగాది తర్వాత రాశి ఖన్నా జాతకం అద్భుతంగా ఉందని.. ఆమె నటించే చిత్రాలు విజయం సాధిస్తాయని వేణు స్వామి అన్నారు. ఇక టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడని అన్నారు. ఓ యంగ్ పొలిటీషియన్ డెడ్లీ యాక్సిడెంట్ కు గురవుతాడని కూడా వేణు స్వామి చెప్పుకొచ్చారు.
undefined
అలాగే టాలీవుడ్ లో ఓ ఫిమేల్ యాంకర్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయని, ఆమె తన భర్త నుంచి విడిపోయే సూచనలు ఉన్నాయని కూడా వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
undefined
ఇలా పేర్లు చెప్పకుండా వేణు స్వామి కామెంట్స్ చేయడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. పబ్లిసిటీ కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సెటైర్లు పడుతున్నారు. ఏడాది కాలంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి.
undefined
అలాంటప్పుడు ఓ హీరో అనారోగ్యానికి గురవుతాడు, ఓ రాజకీయ నాయకుడు ప్రమాదానికి గురవుతాడు అని ఊహించడం గొప్పా.. ఆయన చెప్పినవి జరగొచ్చు జరగక పోవచ్చు అని నెటిజన్లు అంటున్నారు.
undefined
click me!