పవర్ఫుల్ వుమెన్ బయోపిక్ లో అనుష్క.. 88ఏళ్ళ దర్శకుడి ప్రయోగం!

First Published Mar 23, 2020, 10:40 AM IST

అనుష్క మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వస్తోంది. నిశ్శబ్దం సినిమాను సైలెంట్ గా ఫినిష్ చేసిన దేవసేన నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తుందా అని ఆడియెన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ మొదలైంది. 

టాలీవుడ్ స్వీటీ అనుష్క మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వస్తోంది. నిశ్శబ్దం సినిమాను సైలెంట్ గా ఫినిష్ చేసిన దేవసేన నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తుందా అని ఆడియెన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ మొదలైంది.
undefined
ప్రస్తుతం అనేక కథలు వస్తున్నప్పటికీ అనుష్క మాత్రం కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటోందట. అయితే 88ఏళ్ళ ఒక సీనియర్ దర్శకులు ఒకరు అనుష్కతో ఇటీవల ఒక బయోపిక్ గురించి చర్చినట్లు సమాచారం.
undefined
ఆ సీనియర్ దర్శకుడు ఎవరో కాదు. సింగీతం శ్రీనివాసరావు. మాయ బజార్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమను చూసుకుంటూ వస్తున్న సింగీతం శ్రీనివాసరావుకి ఇప్పుడు 88 ఏళ్ళు. అయినప్పటికీ ఆయన లో ఎనర్జి తగ్గలేదు. ఒక మంచి సినిమాతో ఆడియెన్స్ ని అలరించాలని ప్రయత్నం చేస్తున్నారు.
undefined
బెంగుళూరుకు చెందిన నాగ రత్నమ్మ అనే సంగీత కళాకారిణి జీవితాన్ని తెరపై చూపించేందుకు సింగీతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. దేవడాసిగా పుట్టి సంగీత కళాకారిణిగా ఎదిగిన ఆమె జీవిత చారమాంకంలో యోగినిగా మారారు. ఆమె సంపాదన ఆస్థులన్ని చివరలో కళలకు, కళాకారులకు దారపోశారు
undefined
అలాంటి ప్రముఖ మహిళ పాత్రలో అనుష్క నటిస్తే బావుంటుందని సింగీతం ఇటీవల స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. అనుష్క కూడా సీనియర్ దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ కి పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం.
undefined
ఇక నిశ్శబ్దం సినిమా గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే నెలలో రిలీజ్ చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ కరోనా కారణంగా మరికొన్ని రోజులు రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసింది.
undefined
click me!