భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ని గెలవాలంటే ఈ ఆటగాళ్లే కీలకం

First Published Jun 17, 2021, 6:46 PM IST

తొమ్మిది జట్లు పోటీపడిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌లు ఫైనల్లో తలపడేందుకు ఏకైక కారణం.. ఇరు జట్ల మెరుగైన బౌలింగ్‌ విభాగాలు.

టెస్టు మ్యాచుల దశ దిశను నిర్దేశించేది బౌలర్లే. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ వేటలో ఇప్పటివరకు మనం చూసిన అన్ని మ్యాచుల్లోనూ ఇదే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఫైనల్ లో కూడా అదే సీన్ రిపీట్ అవబోతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడుతున్న న్యూజిలాండ్‌, భారత్‌లకు బలమైన పేస్‌ విభాగాలున్నాయి. తొమ్మిది జట్లు పోటీపడిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌, న్యూజిలాండ్‌లు ఫైనల్లో తలపడేందుకు ఏకైక కారణం.. ఇరు జట్ల మెరుగైన బౌలింగ్‌ విభాగాలు. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ కోసం సై అంటున్న తరుణంలో ఏ జట్టుది మెరుగైన బౌలింగ్‌ బృందం అనే ప్రశ్న ఉదయించటం సహజం. ఆ ప్రశ్నకు సమాధానం అంత సులువు కాదు.
undefined
ఇరు జట్ల బలం, బలగం ఇదే...పిచ్‌పై బంతిని బలంగా సంధించి, వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ చేయగల కుడి చేతి ఫాస్ట్‌ బౌలర్లు, ప్రపంచ అత్యుత్తమ ఆఫ్‌ స్పిన్నర్‌, ప్రపంచ మేటీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌. ఓ బౌలింగ్‌ బృందం మేళవింపు ఇది. ఇద్దరు కుడి చేతి అవుట్‌స్వింగ్‌ బౌలర్లు, ఓ లెఫ్టార్మ్‌ ఇన్‌స్వింగ్‌ బౌలర్‌, ఓ లెఫ్టార్మ్‌ షార్ట్‌ బాల్‌ మేటీ, ఓ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌, ఓ మీడియం పేసర్‌లతో కూడిన కలయిక మరో బౌలింగ్‌ బృందం. ఈ రెండింటిలో ఏ బౌలింగ్‌ బృందాన్ని ఎంచుకుంటారు? పిచ్‌, పరిస్థితుల ఆధారంగా ఓ బౌలంగ్‌ బృందానికి ఓటేయవచ్చు. భారత పేసర్లలో వేగం ఉంది. న్యూజిలాండ్‌ పేసర్ల వద్ద వైవిధ్యత ఉంది, స్వింగ్‌ పరిస్థితులకు త్వరగా అలవాటుపడతారు. భారత స్పిన్నర్లు సింపుల్‌గా అత్యుత్తమం. షెడ్యూల్‌ ప్రకారం, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు లార్డ్స్‌ ఆతిథ్యం ఇవ్వాలి. కరోనా పరిస్థితులు, ఆన్‌ సైట్‌ బస సౌకర్యం లేమితో వేదిక సౌథాంప్టన్‌కు చేరుకుంది.
undefined
భారత్ కి కలిసిరానున్న వేదిక మార్పు..?ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వేదిక మార్పుతో ఫైనలిస్ట్‌లలో ఒక జట్టు అయినా, సంతోషించగలదు. 2011 జూన్‌ నుంచి సౌథాంప్టన్‌ టెస్టులను చూస్తే.. ఇంగ్లాండ్‌లో స్పిన్‌కు సహకరించే రెండు అనువైన వేదిక ఇది. పేసర్లకు అంతగా అనుకూలించని రెండో వేదిక సైతం సౌథాంప్టనే. ఇక్కడ స్పిన్నర్ల సగటు 35కు చేరువగా ఉండగా.. పేసర్ల సగటు 30కు చేరువగా ఉంది. భారత్‌ సౌథాంప్టన్‌లో ఆడిన రెండు టెస్టుల్లో స్పిన్‌ కీలక భూమిక వహించింది. 2014 టెస్టులో మోయిన్‌ అలీ ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. మోయిన్‌ అలీ 9134తో విశ్వరూపం చూపించిన 2018 టెస్టులో ఇంగ్లాండ్‌ ఉత్కంఠ విజయం నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో అశ్విన్‌ పూర్తి ఫిట్‌గా ఉంటే ఫలితం మరో జట్టుకు అనుకూలంగా వచ్చేదే!. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలు జట్టులో ఉండటంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ సౌథాంప్టన్‌కు మారటం భారత్‌కు ఉత్సాహం కలిగించే పరిణామం.
undefined
పిచ్ పరిస్థితులు...క్యూరేటర్‌ ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్‌ పిచ్‌.. పేస్‌, బౌన్స్‌తో పాటు స్పిన్‌కూ అనుకూలించనుంది. వాతావరణం, మేఘావృతమైన పరిస్థితులు స్వింగ్‌ బౌలర్లకు ఉత్సాహం ఇవ్వనున్నాయి. టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, కైల్‌ జెమీసన్‌, నీల్‌ వాగర్‌లతో కూడిన పేస్‌ విభాగానిదే పైచేయి. ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌లు బంతిని వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ చేయగలరు. అవసరాన్ని అనుసరించి.. జశ్‌ప్రీత్‌ బుమ్రా సైతం బంతిని స్వింగ్‌ చేయడానికి వెనుకాడడు. ట్రెంట్‌ బౌల్ట్‌, నీల్‌ వాగర్‌లు ఇద్దరూ బరిలో నిలిస్తే.. పిచ్‌పై పడే బూట్ల అచ్చులు భారత ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు మేలు చేయనున్నాయి.
undefined
బౌలింగ్ స్టాట్స్...ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభం నుంచి ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగం భారత్‌ది. వికెట్లు పడగొట్టే విషయంలో భారత బౌలర్లు ముందున్నారు. ప్రతి 42.9 బంతులకు భారత్‌ ఓ వికెట్‌ పడగొట్టింది. ఇదే సమయంలో న్యూజిలాండ్‌ బౌలర్లు 55.3 బంతులకు ఓ వికెట్‌ తీసుకున్నారు. ఓ వికెట్‌ కోసం భారత బౌలర్ల కంటే రెండు ఓవర్లు అదనంగా కివీస్‌ బౌలర్లు వేయాల్సి వచ్చింది. ఎకానమి విషయంలో కివీస్‌ బౌలర్లు ముందున్నారు. 2.67 ఎకానమి న్యూజిలాండ్‌ది కాగా.. భారత బౌలర్లు 3.0 ఎకానమితో పరుగులు ఇచ్చారు. భారత బౌలర్లు వికెట్లపై మెరుపు దాడి చేసేందుకు మొగ్గుచూపగా.. న్యూజిలాండ్‌ బౌలర్లు కాస్త సంయమనం పాటించారు!.డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత బౌలర్లు వికెట్లపైకి 20.05 శాతం బంతులు సంధించారు. 17.45 శాతం బంతులతో న్యూజిలాండ్‌ కేవలం బంగ్లాదేశ్‌ కంటే మెరుగ్గా ఉంది. స్వదేశంలో స్పిన్నర్లు పనిభారం తీసుకుంటే.. విదేశీ టెస్టుల్లో పేసర్లు బాధ్యత తీసుకున్నారు. లెగ్‌ సైడ్‌ అదనపు ఫీల్డర్‌ను మొహరించి వికెట్లపైకి దాడి చేశారు. ప్రత్యేకించి ఆస్ట్రేలియాలో ఈ వ్యూహంతో భారత బౌలర్లు గొప్ప ఫలితం రాబట్టారు.
undefined
ఆల్‌రౌండర్లు కీలకం...ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌లో భారత్‌ ఒకే ఒక్క సిరీస్‌ను కోల్పోయింది. అది కూడా, ఫైనల్‌ ప్రత్యర్థి న్యూజిలాండ్‌ చేతిలోనే కావటం గమనార్హం. భారత్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన జెమీసన్‌.. తొలి ఇన్నింగ్స్‌లోనే పుజారా, విరాట్‌ కోహ్లి సహా నాలుగు వికెట్లు కూల్చాడు. సౌథాంప్టన్‌ పిచ్‌ స్వభావం, ఐదు రోజుల వాతావరణం ఆధారంగా తుది జట్టును ఎంచుకోనున్నారు. బంతితో వాడివేడీగా నిప్పులు చెరగటంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయటంలో న్యూజిలాండ్‌ తోక మెరుగ్గా కనిపిస్తోంది!.కొలిన్‌ డీ గ్రాండ్‌హౌమె, జెమీసన్‌లు బ్యాట్‌తోనూ మెరుస్తారు. టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌లు మహ్మద్‌ షమి, బుమ్రాలతో పోల్చితే బ్యాట్‌తో అధికులు!. సౌథాంప్టన్‌ స్పిన్‌కు కచ్చితంగా సహకరిస్తే భారత్‌ అశ్విన్‌, జడేజా రూపంలో ఇద్దరు ఆల్‌రౌండ్లను జట్టులోకి తీసుకోనుంది. అప్పుడు భారత్‌ సైతం లోయర్‌ ఆర్డర్‌లో బలంగా కనిపించనుంది.
undefined
కొత్త ప్రయోగాలకు వేదిక...జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌లతో కూడిన భారత బౌలర్లు... ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ, నీల్‌ వాగర్‌, మాట్‌ హెన్రీ, డీ గ్రాండ్‌హౌమె, జెమీసన్‌లతో కూడిన న్యూజిలాండ్‌ బౌలర్లు.. ఎవరి అనుకూలతలు, అస్త్రాలతో వారు వార్‌కు రెఢగాీ ఉన్నారు. నీల్‌ వాగర్‌ షార్ట్‌ బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతాడు. సహజంగా అతడు 49 శాతం బంతులను బౌన్సర్లుగానే వదులుతాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆ శాతం 21కి పడిపోయింది. ఇంగ్లాండ్‌ గడ్డపై డ్యూక్‌ బంతులే ఈ మార్పునకు కారణం కావచ్చు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్న పేసర్లు చారిత్రక మ్యాచ్‌లో నూతన ఆయుధాలను బయటపెట్టే అవకాశం లేకపోలేదు. రూ.12 కోట్ల నగదు బహుమతి, టెస్టు గదను గెల్చుకునే జట్టును నిర్ణయించే పేసర్లు సౌథాంప్టన్‌లో కొత్త ఆవిష్కరణలు, సరికొత్త అస్త్రాలను సంధిస్తారనే అంచనాలు క్రికెట్‌ వర్గాల్లో జోరుగానే ఉన్నాయి.
undefined
click me!