నెట్స్లో గాయపడ్డ మయాంక్ అగర్వాల్... ఇంకా ఆడడానికి ప్లేయర్లు ఉన్నారా?
First Published Jan 12, 2021, 10:31 AM ISTఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది బీసీసీఐ. వీరితో పాటు నెట్ బౌలర్లుగా మరో ముగ్గురు బౌలర్లు రిజర్వు చేసుకుంది. అయితే మూడో టెస్టు ముగిసేసరికి టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఆరుగురు గాయాలతో తప్పుకున్నారు. మొదటి టెస్టులో షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్... మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా గాయాలతో నాలుగో టెస్టుకి దూరమయ్యారు. మంచి ఫామ్లో ఉన్న కెఎల్ రాహుల్ నెట్స్లో గాయపడి, సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ కూడా నెట్స్లో ప్రాక్టీస్ చూస్తూ గాయపడ్డాడట.