నెట్స్‌లో గాయపడ్డ మయాంక్ అగర్వాల్... ఇంకా ఆడడానికి ప్లేయర్లు ఉన్నారా?

First Published Jan 12, 2021, 10:31 AM IST

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది బీసీసీఐ. వీరితో పాటు నెట్ బౌలర్లుగా మరో ముగ్గురు బౌలర్లు రిజర్వు చేసుకుంది. అయితే మూడో టెస్టు ముగిసేసరికి టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఆరుగురు గాయాలతో తప్పుకున్నారు. మొదటి టెస్టులో షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్... మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా గాయాలతో నాలుగో టెస్టుకి దూరమయ్యారు. మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ నెట్స్‌లో గాయపడి, సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చూస్తూ గాయపడ్డాడట.

టెస్టు సిరీస్ ఫలితం తేల్చే అత్యంత కీలకమైన నాలుగో టెస్టులో బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, టెస్టు స్పెషలిస్ట్ హనుమ విహారి లేకుండానే బరిలో దిగనుంది భారత జట్టు.
undefined
ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాకి రాకపోవడం, షమీ, ఉమేశ్ యాదమ్, తాజాగా బుమ్రా కూడా గాయపడడంతో భారత బెస్ట్ బౌలింగ్ కూడా అందుబాటులో ఉండదు...
undefined
రవిచంద్రన్ అశ్విన్ గాయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అధికారికంగా నాలుగో టెస్టు ఆడడం లేదు...
undefined
అంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్ బౌలర్లు, బెస్ట్ ఆల్‌రౌండర్లు లేకుండా ‘గబ్బా’ టెస్టు మ్యాచ్ ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు...
undefined
నెట్స్ గాయపడిన మయాంక్ అగర్వాల్... నాలుగో టెస్టు సమయానికి కోలుకోకపోతే భారత జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది..
undefined
బుమ్రా లేకుంటే రెండు టెస్టుల అనుభవం ఉన్న సిరాజ్, ఒకే టెస్టు ఆడిన నవ్‌దీప్ సైనీ, ఇంకా టెస్టు ఆరంగ్రేటం చేయని నటరాజన్, టీనేజర్ కార్తీక్ త్యాగిలతో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలబడాల్సి ఉంటుంది భారత జట్టు...
undefined
ఇంత తక్కువ అనుభవం ఉన్న బౌలింగ్ యూనిట్, స్మిత్, వార్నర్, లబుషేన్ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌ను ఎంత వరకూ ఇబ్బంది పెట్టగలరనేది తేలిగ్గా అంచనా వేయొచ్చు...
undefined
హనుమ విహారి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఆడించాలని భావించింది టీమిండియా. కెఎల్ రాహుల్ కూడా మధ్యలోనే స్వదేశం చేరడంతో భారత జట్టుకి మరో ఆప్షన్ కూడా లేదు...
undefined
ఇప్పుడు మయాంక్ అగర్వాల్ కూడా నాలుగో టెస్టు సమయానికి కోలుకోకపోతే మొదటి టెస్టులో ఘోరంగా విఫలమైన పృథ్వీషా జట్టులోకి వస్తాడు. లేదా వృద్ధిమాన్ సాహాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
undefined
మూడో టెస్టులో గాయం కారణంగా రిషబ్ పంత్‌ను బ్యాట్స్‌మెన్‌గా, వృద్ధిమాన్ సాహాను వికెట్ కీపర్‌గా వాడుకున్న టీమిండియా... నాలుగో టెస్టులో ఇద్దరికీ చోటు కల్పించే అవకాశం ఉంది.
undefined
శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, పూజారా, అజింకా రహానే, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా లేదా పృథ్వీషా... బ్యాటింగ్ ఆర్డర్‌లో భారత జట్టుకి ఎలాంటి ఇబ్బందీ లేదు.
undefined
బౌలింగ్‌లోనూ టీమిండియా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. టాప్ క్లాస్ బౌలర్లతో ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగుపెట్టిన భారత జట్టు, గాయాల కారణంగా స్టార్లను దూరం చేసుకోవాల్సి వచ్చింది.
undefined
మిగిలిన బౌలర్లకు పెద్దగా అనుభవం లేకపోవడంతో గాయం నుంచి 50 శాతం కోలుకున్నా, బుమ్రాను ఆడించాలని భావిస్తోందట టీమిండియా. అవసరమైతే వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ సిరీస్‌లో బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలని చూస్తోందట.
undefined
క్వారంటైన్ నిబంధనల కారణంగా కొత్త ప్లేయర్లను ఆస్ట్రేలియాకు పంపలేని పరిస్థితి. లేకపోతే ప్రస్తుతం స్వదేశంలో సయ్యద్ ముస్తాక్ ఆలీలో పాల్గొంటున్న శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ అండ్ కో నాలుగో టెస్టు కోసం ఆసీస్‌కి వెళ్లేవారే.
undefined
click me!