క్రికెట్ ఫ్యాన్స్ కి పండగే : ఐపిఎల్ 2025 కి ముహూర్తం ఫిక్స్, ఎప్పటినుండంటే..

Published : Jan 28, 2025, 10:31 AM ISTUpdated : Jan 28, 2025, 11:50 AM IST

ఐపిఎల్ ... ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ టోర్నీ ఓ  పండగలాంటింది. ప్రతి ఏడాది మాదిరిగానే 2025 సమ్మర్ లో ఈ టోర్నీనిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎప్పటినుండి ప్రారంభంకానుందో తెలుసా? 

PREV
12
 క్రికెట్ ఫ్యాన్స్ కి పండగే : ఐపిఎల్ 2025 కి ముహూర్తం ఫిక్స్, ఎప్పటినుండంటే..
IPL 2025

IPL 2025 : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 21 నుండి ఈ మహా క్రీడా సమరం ప్రారంభం అవుతుందని ఐపిఎల్ ఛైర్మన్ అరుణ్ ధమాల్ స్పష్టం చేసారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన వివరాలను ఛైర్మన్ వెల్లడించారు. 

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ది, గ్రామీణ యువత క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు నిర్వహించే సంసద్ ఖేల్ మహాకుంభ్ కు ఐపిఎల్ ఛైర్మన్ అరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపిఎల్ 2025 గురించి మాట్లాడారు. 'ఐపిఎల్ సీజన్ ఈ ఏడాది కూడా మార్చ్ లో ప్రారంభం అవుతుంది. మార్చి 21న ఈ టోర్నీని ప్రారంభిస్తాం. త్వరలోనే పూర్తి షెడ్యూల్ ను విడుదల చేస్తాం' అని ఆయన తెలిపారు. 

ఇప్పటికే బిసిసిఐ వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఐపిఎల్ సీజన్ 2025 పై క్లారిటీ ఇచ్చారు. మార్చి 21న ఈ టోర్నీ ప్రారంభం అవుతుందని ఆయన కూడా వెల్లడించారు.  గత సీజన్ లో మార్చి 22న ఐపిఎల్ ప్రారంభమైంది...కానీ ఈసారి ఓరోజు ముందుగానే ఈ మెగా టోర్నీ ప్రారంభం అవుతోంది. 

22
IPL 2025

ఐపిఎల్ వేలంతో మారిన జట్లు : 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో ప్రతి టీంలో మార్పులు వుండనున్నాయి. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపిఎల్ మెగా వేలం జరిగింది. కొందరు కీలక ఆటగాళ్లు మినహా మిగతా జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లను వివిధ జట్లు కొనుగోలుచేసాయి. ఇలా ఈ వేలంలో 182 మంది ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు రూ.639 కోట్లకు పైగా ఖర్చు చేసాయి. 

ఈ వేలంపాట ద్వారా గతంలో ఓ జట్టులో వున్న ఆటగాళ్లు ఇప్పుడు మరోజట్టుకు మారారు. కొన్ని జట్లకు ఏకంగా కెప్టెన్లు కూడా మారారు. ఈ వేలంలో డిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది లక్నో సూపర్ జెయింట్స్. తద్వారా ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.

అలాగే గతంలో కోల్ కతా కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ ను తాజా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ.26 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ ను రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది కోల్ కతా. ఇలా కేవలం ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ కోసమే ఏకంగా రూ.76 కోట్లకు పైగా ఖర్చుచేసాయి ఫ్రాంచైజీలు. 

ఇక యువ బౌలర్ అర్షదీప్ ను కూడా రికార్డు స్థాయిలో రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అలాగే చాహల్ ను కూడా రూ.18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. విదేశీ ఆటగాళ్లలో బట్లర్ ను రూ.15.75 కోట్లకు గుజరాత్, ఆర్చర్ ను రాజస్థాన్ రూ.12.50, బౌల్ట్ ను ముంబై రూ.12.50, హెజిల్ వుడ్ ను బెంగళూరు రూ.12.50, స్టార్క్ ను డిల్లీ రూ.11.75 కోట్లకు  దక్కించుకున్నాయి. 

ఇక హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇకపై గుజరాత్ టైటాన్స్ కు ఆడనున్నాడు. అతడిని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే హైదరాబాద్ టీం యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను రూ.11.25, సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని రూ.10  కోట్లకు కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ ను రూ.8 కోట్లు, రాహుల్ చాహర్ రూ.3.20 కోట్లు, అభినవ్ మనోహర్ ను రూ.3.40 కోట్లు, ఆడమ్ జంపాను రూ.2.40 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. 


 

Read more Photos on
click me!

Recommended Stories