కాగా చాలా కార్యాలయాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో ఆర్జిపి గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా డిసెంబర్ 31 సాయంత్రం ట్వీట్ చేస్తూ తమ కంపెనీ ఉద్యోగులందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలని, అలాగే అన్ని కార్యాలయాలు మూసివేయబడతాయని తెలియజేసారు. దీంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీని కింద, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు.