EPFO వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎఫ్ డబ్బును ఏటీఎంల నుంచి నేరుగా విత్డ్రా చేసుకోవచ్చని ఇటీవల కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దౌరా భారీ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, కార్మికులకు మేలు చేయాలని, వారికి కేంద్రం అందిస్తున్న సౌకర్యాలు మరింత సింపుల్ గా, త్వరగా అందించాలని టెక్నాలజీలను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు.