భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వరుస ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే నెట్వర్క్ సిగ్నల్స్ ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టంది. BSNL ఇటీవల సుమారు 51,000 కొత్త 4G మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. దీంతో వినియోగదారులు మొబైల్, బ్రాడ్బ్యాండ్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించుకుంటున్నారు. అంతే కాకుండా టాటా కంపెనీతో కలిసి వినియోగదారుల కోసం మరిన్ని సేవలు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది.