భారత ఐటీ రంగంలోని సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు,ఎగ్జిక్యూటివ్ల జితాలు,అలవెన్సులు చూస్తే అవాక్కవాల్సిందే..

First Published Jun 11, 2021, 4:52 PM IST

న్యూఢిల్లీ. ఐటీ సంస్థ విప్రో సీఈఓ  థియరీ డెలాపోర్ట్  2020-21 ఆర్థిక సంవత్సరంలో 87 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ .64.3 కోట్ల జీతం అందుకున్నారు. ఈ జీతం  6 జూలై 2020 నుండి 31 మార్చి 2021 వరకు చెల్లించినట్లు తెలిపింది. 

అయితే ఇందులో వన్‌టైమ్ క్యాష్, వార్షిక వాటా మంజూరు, వన్-టైమ్ ఆర్‌ఎస్‌యు (లిమిటెడ్ షేర్ యూనిట్) ఉన్నాయి అని విప్రో స్టాక్ ఎక్స్ఛేంజికి తెలియజేశారు.
undefined
మాజీ క్యాప్ జెమిని ఎగ్జిక్యూటివ్ అయిన థియరీ డెలాపోర్ట్ గత ఏడాది జూలై 6న విప్రో సి‌ఈ‌ఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ పదవిలో ఉన్న అబిదాలి నీముచ్వాలా స్థానంలో డెలాపోర్ట్ ఎన్నికయ్యారు. సమాచారం ప్రకారం, థియరీ డెలాపోర్ట్‌కు వేతనం, అలవెన్స్ కలిపి మొత్తం 13.1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 9.6 కోట్లు. కమీషన్, వేరియబుల్ పే 15.4 మిలియన్ డాలర్లు, ఇతర బెనెఫిట్స్ 51.8 మిలియన్ డాలర్లు. ఈ కాలంలో అతనికి 7,58,719 దీర్ఘకాలిక పరిహారం (లాంగ్ టర్మ్ కంపెన్సేషన్) కూడా ఇవ్వబడింది.
undefined
రెండవ టాప్ సీఈఓ జీతం ఎంత ?ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్‌కు 2020-21లో రూ .49.68 కోట్ల జీతం లభించగా, టీసీఎస్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథ్‌కు రూ .20.36 కోట్ల జీతం లభించింది. ముఖేష్ అంబానీ వార్షిక వేతనం రూ .15 కోట్లు. గత కొన్నేళ్లుగా ఆయన జీతం పెంచలేదు. ముఖేష్ అంబానీ జీతం అతని సంస్థలోని ఇతర అధికారుల జీతం కంటే ఎక్కువ. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్. ఆర్. మెస్వాని వార్షిక ప్యాకేజీ రూ .24 కోట్లు. సంస్థ మరొక డైరెక్టర్ హిటల్ ఆర్ మెస్వానీకి కూడా ఇదే ప్యాకేజీ వచ్చింది.
undefined
కంపెనీ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్‌కు సుమారు రూ .12 కోట్ల జీతం లభించగా, పవన్‌ కుమార్ కపిల్‌కు రూ .4.24 కోట్ల జీతం లభించింది. అయితే ఇద్దరికీ రూ .17.28 కోట్ల కమీషన్ కూడా లభించింది.
undefined
click me!