దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో 5G సేవలను అందిస్తున్నామని VI ఇటీవల ఓ ప్రకటన చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా VI 5G సేవలు అందుబాటులోకి వస్తాయని వోడాఫోన్-ఐడియా తెలిపింది. ప్రస్తుతానికి బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో వోడాఫోన్ ఐడియా 5G సేవలు ప్రారంభమయ్యాయి.
ఈ నగరాలే కాకుండా జైపూర్, పాట్నా, హర్యానా కర్నాల్, లక్నో, ఆగ్రా, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, సిలిగురి, జలంధర్, పూణే వంటి నగరాల్లో కూడా వోడాఫోన్ ఐడియా 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్లు తమ 4G సేవల నుండి 5G సేవలకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు.