దేశవ్యాప్తంగా ఆన్ లైన్ పేమెంట్స్ పెరిగిపోయాయి... ఇప్పుడు బడా షాపింగ్ మాల్స్ నుండి తోపుడుబండిపై అమ్మే కూరగాయాల వరకు ప్రతి దగ్గర క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఆన్ లైన్ పేమెంట్స్ పెరిగిపోయిన వేళ సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో రోజురోజుకు ఈ మోసాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి.
ఆన్లైన్ చెల్లింపుల ట్రెండ్ పెరగడంతో ప్రజలు ఇప్పుడు నగదుకు బదులుగా ఆన్లైన్ చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ప్రతిసారి డబ్బులు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం ఫోన్ ద్వారానే చెల్లింపులన్ని చేయవచ్చు. ఇది సులభమైన చెల్లింపు పద్ధతి.