వందేభారత్ రైలులో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సీట్లలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి . అన్నింటిలో మొదటిది, ఈ సీట్లు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ప్రయాణికులు తమ సౌకర్యాన్ని బట్టి ఈ సీట్లను 180 డిగ్రీల వరకు తిప్పుకోవచ్చు. విమానాల సీట్ల తరహాలోనే ఇవి అత్యంత సౌకర్యవంతమైన సీట్లు, సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ సీట్లు ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ (FRP)తో తయారు చేశారు. దీని వల్ల ఈ సీట్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణికుల భద్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సీట్లు భారతదేశంలో మొదటిసారిగా రైళ్లలో వినియోగిస్తున్నారు.