సునీల్ మిట్టల్
భారతీ ఎయిర్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ అయిన సునీల్ మిట్టల్.. ఎక్కువగా శాకాహారం తినడానకి ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా వ్యాపార పరమైన కీలక సందర్భాల్లో పూర్తిగా శాకాహారం తీసుకుంటారట. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, అది సక్సెస్ కావడానికి వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ దీక్షగా ఉంటారట. ఆ సమయంలో ఆలోచనలు కూడా పాజిటివ్ గా, ఎంతో ఉపయోగపడే విధంగా వస్తాయని సునీల్ చెబుతున్నారు.
ఆయన ఇష్టమైన వెజిటేరియన్ ఆహారాల్లో పిజ్జా మార్గరీటా, స్పాగెట్టీ మొదలైనవి ఉన్నాయి. వీటిని సాధారణంగా కాఫీ షాప్లలో లేదా వ్యాపార చర్చల సందర్భంగా తీసుకోవడం ఆయనకు ఇష్టం.