జనరల్ గా మనమందరం ట్యాక్స్ కడుతుంటాం. డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ విధానాల్లో పన్నులు చెల్లిస్తూనే ఉంటాం. అయితే కొంతమంది ట్యాక్స్ ఎగ్గొడుతుంటారు. అలాంటి వారికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని వెల్లడించని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ వెంటనే వెల్లడించాలని కోరుతోంది. డిసెంబర్ 31, 2024 వరకు వారికి గడువు ఇచ్చింది. గడువులోపు విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని వెల్లడించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది.