టాటా మోటార్స్ మూడు కొత్త కార్లను ఆవిష్కరించనుంది. పంచ్, టియాగో, టిగోర్ ఫేస్లిఫ్ట్ మోడల్స్ ధర కూడా బడ్జెట్ లోనే ఉంటుందని సమాచారం. ప్రతి ఒక్క కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా లక్ష్యాన్ని నెరవేర్చడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది. అందుకే కార్ల ధరలు తగ్గించి విడుదల చేయనుందని తెలుస్తోంది.
ఆటో ఎక్స్పో (భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025) ఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 17 నుంచి 22 వరకు జరుగుతుంది. అదేవిధంగా ద్వారకా యశోభూమిలో జనవరి 18-21 వరకు నిర్వహిస్తారు. గ్రేటర్ నోయిడా ఎక్స్పో మార్ట్ సెంటర్లో జనవరి 19 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో దేశ, విదేశ కంపెనీలతో పాటు దాదాపు 5 లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.