వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ వారంలో నాలుగో రోజైన గురువారం బ్రేక్ పడటం గమనార్హం. ట్రేడింగ్ ముగిసే సమయానికి, బిఎస్ఈ 30-షేర్ల సెన్సెక్స్ 621 పాయింట్లు పడిపోయింది దీంతో మళ్లీ 60 వేల దిగువకు వచ్చి 59,601 స్థాయి వద్ద ముగిసింది. కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి 17,746 వద్ద ముగిసింది. బుధవారం సెన్సెక్స్ భారీ జంప్ చేయడం ద్వారా 60 వేల స్థాయిని అధిగమించింది.