యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఊహించినదాని కంటే ముందుగానే వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయించుకుందనే వార్తలు వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు అయోమయంలో పడ్డారు. దీంతో క్రిస్మస్ సీజన్ ముగిసిన తర్వాత న్యూ ఇయర్లో దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఉదయం షేర్ మార్కెట్ మొదలైన పదిహేను నిమిషాల్లోనే 546 పాయింట్లు నష్టపోయింది. దీంతో మరోసారి 60 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. మరోవైపు నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయి 17,768 దగ్గర ట్రేడవుతోంది. సాయంత్రం వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే మరోసారి ఇన్వెస్టర్లు భారీ నష్టం తప్పదు.