అమృత్ వృష్టి ఎఫ్డి పథకం ఎక్కువ మందికి అందుబాటులో ఉండే స్కీమ్. ఎందుకంటే కనీస డిపాజిట్ మొత్తం కేవలం రూ.1,000 మాత్రమే. అంతకు మించి మీరు ఎంత డిపాజిట్ చేయగలిగితే అంత చేయొచ్చు.
ఉదాహరణకు సీనియర్ సిటిజన్లు రూ.2,00,000 పెట్టుబడి పెడితే 7.75% వడ్డీతో రూ.19,859 వడ్డీని పొందొచ్చు. అంటే మెచ్యూరిటీ మొత్తం రూ. 2,19,859 అవుతుంది. అదే సాధారణ పౌరులకు 7.25 % వడ్డీ రేటుతో రూ.2 లక్షలకు వడ్డీ రూ.18,532 లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ మొత్తం రూ.2,18,532 మీరు పొందవచ్చు.