భారతదేశపు అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ర్యాంక్ పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన రాజ జీవన విధానం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. నీతా అంబానీ సాంఘిక సంక్షేమ పనులలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అంతేకాదు నీతా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ కూడా.