ఆసియాలోని అత్యంత సంపన్న కార్పోరేట్ కుటుంబాలలో ఒకటైన అంబానీ కుటుంబం, తమ రిలయన్స్ గ్రూపులో నాయకత్వ బదిలీని వేగవంతం చేసింది. గతంలో ధీరూభాయి అంబానీ ఆస్తుల విభజన చేయకుండానే, పరమపదించారు. దీంతో వారసులైన ముకేష్, అనిల్ అంబానీల మధ్య వివాదం నెలకొన్నది, అయితే ఆ తప్పును తాను చేయకూడదని నిర్ణయించుకున్న ముకేష్ అంబానీ, ఇప్పుడు రిలయన్స్ బాధ్యతలను తన వారసులైన ఆకాష్, ఈశా, అనంత్ అంబానీలకు కంపెనీ బాధ్యతలను అప్పగిస్తున్నారు.