ఇజ్రాయెల్ కష్టతరమైన తీవ్ర యుద్ధాన్ని ప్రారంభిస్తోందని, లక్ష్యాలను సాధించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అన్నారు.
"హమాస్ హింసాత్మక దాడి ద్వారా యుద్ధం మాపై విధించబడింది. మా భూభాగంలోకి ప్రవేశించిన చాలా శత్రు దళాలను నాశనం చేయడంతో మొదటి దశ ముగిసింది. అలాగే మేము మా లక్ష్యాలను చేరుకునే వరకు మా దాడి విశ్రాంతి లేకుండా కొనసాగుతుంది. మేము ఇజ్రాయెల్ పౌరులకు భద్రతను పునరుద్ధరిస్తాము, మేము గెలుస్తాము" అని నెతన్యాహు ట్విట్టర్లో పోస్ట్ చేసారు.