ఈ ప్లాన్ వేసుకుంటే కలిగే గొప్ప ప్రయోజనం ఏంటంటే.. మీరు క్రికెట్ మ్యాచ్లను యాడ్స్ లేకుండా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సౌకర్యం కోసమైనా క్రికెట్ అభిమానులు సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారని కంపెనీ భావిస్తోంది.
రిలయన్స్- డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశంలో 100కు పైగా టీవీ చానల్స్, అనేక స్క్రీనింగ్ యాప్లను నిర్వహిస్తోంది. అందువల్ల ఇకపై ఐపీఎల్ క్రికెట్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని రాయటర్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.