ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
2022-23 సంవత్సరానికి బడ్జెట్ సమర్పణకు ఇంకా రెండు నెలల కంటే తక్కువ సమయం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ రంగం, ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమ, పరిశ్రమల ప్రతినిధులు, ఆరోగ్యం, విద్యా రంగ నిపుణులు, ఆర్థికవేత్తలు, కార్మిక సంఘాల నేతలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆర్థిక మంత్రిగా నాలుగో బడ్జెట్
ఈ బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాల్గవ బడ్జెట్ గా ప్రదర్శించనున్నారు. ఆమే జూలై 2019లో తన మొదటి బడ్జెట్ను సమర్పించారు, రెండు నెలల్లో ఆర్థిక వ్యవస్థపై సంక్షోభం దృష్ట్యా కార్పొరేట్ పన్ను తగ్గింపును ప్రకటించాల్సి వచ్చింది.