ఈ లావాదేవీలకు PAN తప్పనిసరి..
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా లేదా ఇతర బ్యాంకు ఖాతాల నుండి రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ కనుక చేస్తే PAN తప్పనిసరి అని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. 2020 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 20 లక్షల నగదు ఉపసంహరణపై టీడీఎస్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రూపొందించిన కొత్త నిబంధన ప్రకారం, ఖాతాదారుడితో పాటు, బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులు లావాదేవీ ప్రారంభంలోనే పాన్, ఆధార్ వివరాలను ఇవ్వాలి. బ్యాంకు ఖాతాల నుంచి రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపే వారికి పాన్ కార్డును వినియోగించేలా కొత్త నిబంధన అదనపు ఫిల్టర్గా పని చేస్తుంది. అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం పాన్, ఆధార్ లకు సంబంధించిన స్టాండర్డ్ మెథడ్స్ (ఎస్ఓపి)లను కూడా తీసుకురానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.