గోల్డెన్ ఛారియట్ రైలు మార్గాలు
ఈ లగ్జరీ రైలు 5 రాత్రులు, 6 పగళ్ళు ప్రయాణిస్తూనే ఉంటుంది. అంటే ఇది బెంగళూరు, బందిపూర్, మైసూర్, హలేబీడు, చిక్మగళూర్, హంపి, గోవా మీదుగా ప్రయాణికులను తీసుకెళుతుంది. జ్యువెల్స్ ఆఫ్ సౌత్ యాత్ర పేరుతో బెంగళూరు, మైసూర్, హంపి, మహాబలిపురం, తంజావూర్, చెట్టినాడు, కొచ్చి నగరాలను ఇది చుట్టి వస్తుంది. బెంగళూరు, బందిపూర్, మైసూర్ మరియు హంపిని మూడు రాత్రులు, నాలుగు రోజుల్లో కవర్ చేస్తుంది.
రైలు టికెట్ ధర
డీలక్స్ క్యాబిన్లో టిక్కెట్ ధర దాదాపు రూ.4,00,530 గా నిర్ణయించారు. దీనికి 5% GSTకూడా యాడ్ అవుతుంది. ఈ ధరలో లగ్జరీ వసతి, అన్ని భోజనాలు, ప్రీమియం పానీయాలు, గైడెడ్ టూర్లు, స్మారక చిహ్నాల ఎంట్రీ ఫీజులు కూడా ఉంటాయి.