గడచిన 23 సంవత్సరాలుగా మనం బంగారం ధరలను గమనించినట్లయితే, సరిగ్గా 2000 సంవత్సరంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 4400గా ఉంది. అక్కడి నుంచి సరిగ్గా 2010 నాటికి అంటే పది సంవత్సరాల్లో బంగారం ధర 18,500 కు చేరింది. అంటే నాలుగు రెట్లు పెరిగింది. అనంతరం బంగారం ధర 2020 నాటికి 50 వేలకు చేరింది. అంటే దాదాపు మూడింతలు పెరిగింది. ఈ లెక్కన చూసినట్లయితే 2025 నాటికి బంగారం ధర ఒక లక్ష రూపాయలు దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.