పి‌ఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత కూడా ఇ-నామినేషన్ చేయవచ్చు

Ashok Kumar   | Asianet News
Published : Dec 30, 2021, 01:37 PM IST

 మీరు పి‌ఎఫ్ ఖాతాదారు అయితే ఈ వార్త మీకోసమే. ఏంటంటే ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(epfo) ఖాతాదారులకు పెద్ద ఉపశమనం ఇచ్చింది. దీని కింద ఈ-నామినేషన్ (e-nomination)ద్వారా నామినీలను చేర్చుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. అంటే, ఇప్పుడు ఖాతాదారులు 31 డిసెంబర్ 2021 తర్వాత కూడా ఇ-నామినేషన్ చేయవచ్చు.

PREV
12
పి‌ఎఫ్ ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత కూడా ఇ-నామినేషన్ చేయవచ్చు

ఇంతకుముందు ఈ‌పి‌ఎఫ్ ఖాతాదారులకు ఇ-నామినేషన్ డిసంబర్ 31 చివరి తేదీగా  నిర్ణయించారు. ఇప్పుడు తాజాగా ఈ తేదీని పొడిగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో, ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత కూడా పి‌ఎఫ్ చందాదారులు ఇ-నామినేషన్ చేయవచ్చని ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​ఒక ట్వీట్‌లో తెలియజేసింది. అయితే ఈ ప్రక్రియ కొనసాగే తేదీకి సంబంధించి ఎటువంటి నిర్ణీత తేదీని వెల్లడించలేదు. 
 

22

ఈ‌పి‌ఎఫ్‌ఓ ఆన్‌లైన్ పోర్టల్ డౌన్ కావడం వంటి టెక్నికల్ సమస్యలపై కూడా చాలా మంది ఫిర్యాదు చేశారని పోర్టల్‌లోని  కంప్లెంట్ నివేదిక పేర్కొంది. అయితే, రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు ఉపశమనం ఇవ్వడంతో పాటు ఇ-నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒక సలహాను జారీ చేసింది. 

click me!

Recommended Stories