ఎంత ప్రోత్సాహం అందిస్తున్నా పెట్రోల్ వాహనాల ధరలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. రూ.లక్షల్లో వాటి మధ్య తేడాలు ఉండటం, ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడంతో ఈవీల కొనుగోళ్లు తక్కువగానే జరుగుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ ప్రకటన చేశారు. 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో గడ్కరీ ప్రసంగించారు.