కారులో 100, 120 స్పీడ్ తో వెళ్తేనే టైర్ల నుంచి భారీగా శబ్దం వస్తుంది కదా.. కాని సియట్ కంపెనీ తయారు చేస్తున్న ఈ కొత్తరకం టైర్లు 300 కి.మీ. వేగంతో దూసుకుపోయినా అస్సలు శబ్దం చేయవు. పైగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. భారత్లో తొలిసారిగా తమ స్పోర్ట్డ్రైవ్ శ్రేణిలో గ్లోబల్ టెక్నాలజీస్ను ఆవిష్కరిస్తూ సియట్ ఈ టైర్లను తీసుకొస్తోంది.
ఈ టైర్లు అల్ట్రా-లగ్జరీ, హై-పెర్ఫార్మెన్స్ కార్లు, ఎస్యూవీలకు అనుగుణంగా తయారవుతున్నాయి. 300 కి.మీ.కి మించిన వేగాన్ని కూడా తట్టుకునేలా ZR-రేటెడ్ టెక్నాలజీతో తయారు చేస్తారు. రోడ్డుపై వెళుతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గించి, డ్రైవింగ్ అనుభూతిని మెరుగుపర్చేలా CALM టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు.
పంక్చర్ అయిన తర్వాత కూడా మినిమం స్పీడ్ తో వాహనం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ టైర్ల వల్ల హై-ఎండ్ సెడాన్లు, ఎస్యూవీలకు అదనపు భద్రత లభిస్తుంది.
ఈ టైర్లు 21 అంగుళాల మందం ఉంటాయి. ZR రేటెడ్ టైర్లను తయారు చేసే తొలి భారతీయ టైర్ల తయారీ సంస్థగా సియట్ నిలిచింది.
ఈ టైర్లు జర్మనీలోని అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్లాంట్లలో కఠినతరమైన పరీక్షలన్నింటిలో బెస్ట్ గా నిలిచాయి. పనితీరు, భద్రత రీత్యా అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉన్నాయని గుర్తింపు పొందాయి.
ఈ టైర్ల వల్ల లగ్జరీ, హై పెర్ఫార్మెన్స్ వాహనాలకు మెరుగైన భద్రత లభిస్తుంది. ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. కారు నడిపే వారికి, కూర్చున్న వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
సియట్ నుంచి ఈ అద్భుతమైన టైర్లు ఏప్రిల్ నుంచి ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, పుణె, చండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్, బెంగళూరు, తమిళనాడు, కోయంబత్తూరు, మదురై, కేరళ, హైదరాబాద్, గువాహటి, అహ్మదాబాద్లాంటి కీలక మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి.
రన్-ఫ్లాట్ టైర్ల ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 దాకా ఉంటుంది. అలాగే 21 అంగుళాల ZR రేటెడ్ అల్ట్రా-హై-పెర్ఫార్మెన్స్ CALM టెక్నాలజీ టైర్ల ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది.