తెలంగాణకు మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని పెట్టుబడుల సాధనకి పడుతున్న తపన రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కేటీఆర్ చొరవతో అమెరికాకు చెందిన ప్రసిద్ధ విద్యుత్ వాహనాల సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో రూ.1,144 కోట్లతో భారీ త్రిచక్ర వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయంపై పట్ల మంత్రి అజయ్ హర్షం వ్యక్తం చేశారు.